News March 24, 2025
ప్రతిజ్ఞ చేయించిన బాపట్ల కలెక్టర్

ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా కలెక్టరేట్లో ఆదివారం జిల్లా అధికారుల సమక్షంలో జిల్లా కలెక్టర్ వెంకట మురళి ప్రతిజ్ఞ చేయించారు. ఇందులో భాగంగా జిల్లాలో 27 టీబీ రహిత గ్రామ పంచాయతీలుగా గుర్తించి వాటికి సిల్వర్, బ్రాంజ్ గాంధీ విగ్రహాలను DPOకి అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, DLATO తదితరులు హాజరయ్యారు.
Similar News
News December 1, 2025
పార్వతీపురం మన్యం జిల్లాలో సీఎం పర్యటన.. ఎప్పుడంటే?

భామిని మండలంలో ఈ నెల 5న సీఎం చంద్రబాబు పర్యటించనున్నట్లు సీఎంవో కార్యాలయం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఉదయం 8:20 గంటలకు తాడేపల్లిలో బయలుదేరి 10:20 గం.కు భామినిలోని హెలీ ప్యాడ్కు చేరుకుంటారు. అక్కడనుండి 10:30కు ఏపీ మోడల్ పాఠశాలకు రోడ్డు మార్గంలో చేరుకొని మధ్యాహ్నం 2 గంటల వరకు పాఠశాలలో జరిగే మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2:10 గంటలకు తిరుగుపయనమవుతారు.
News December 1, 2025
సిద్దిపేట: ఎన్నికలపై అధికారులతో కలెక్టర్ సమావేశం

గ్రామపంచాయతీ ఎలక్షన్ నేపథ్యంలో ఎంపీడీఓ, ఎంపీఓ, అర్ఓ, ఏఅర్ఓ ఇతర అధికారులతో కలెక్టర్ హైమావతి సోమవారం జూమ్ సమావేశం నిర్వహించి అధికారులకు ఎలక్షన్ ప్రక్రియ గురించి దిశా నిర్దేశం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మొదటి విడత స్క్రూటిని ప్రక్రియ గురించి ఆరా తీశారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ మాకర్గదర్హకాలకు అనుగుణంగా స్క్రూటిని చేయాలన్నారు.
News December 1, 2025
ఇంట్లో గణపతి విగ్రహం ఉండవచ్చా?

గృహంలో వినాయకుడి ప్రతిమను నిరభ్యంతరంగా ప్రతిష్ఠించవచ్చని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఇష్ట దైవాలు, కుల దేవతల విగ్రహాలతో పాటు గణపతి విగ్రహాన్ని కూడా పూజా మందిరంలో పెట్టవచ్చు అని చెబుతున్నారు. అయితే, నవ గ్రహాలు, ఉగ్ర దేవతా మూర్తుల విగ్రహాలు లేదా చిత్ర పటాలు పూజా గదిలో లేకుండా చూసుకోవడం ఉత్తమమని వివరిస్తున్నారు. వాస్తు ప్రకారం.. గణపతి విగ్రహం ఉంటే ఎలాంటి దోషం ఉండదంటున్నారు.<<-se>>#Vasthu<<>>


