News December 9, 2024

ప్రతిపక్షాల విమర్శలు పట్టించుకోం: మంత్రి శ్రీధర్ బాబు

image

ప్రతిపక్ష నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ మేరకు వరంగల్ పర్యటన సమయంలో ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేతలు ప్రభుత్వాన్ని రెచ్చగొట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోమని, ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. 6 గ్యారెంటీల వాగ్దానాలకు కట్టుబడి ఉన్నామని, ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తామన్నారు.

Similar News

News December 10, 2025

అవినీతి రహిత సమాజమే లక్ష్యం: కలెక్టర్ పమేలా సత్పతి

image

అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం సందర్భంగా మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో ప్రతిజ్ఞా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అవినీతి వ్యతిరేక దినోత్సవ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అవినీతి రహిత సమాజం మనందరి లక్ష్యం కావాలని ఆమె పేర్కొన్నారు.

News December 9, 2025

కరీంనగర్ ఆర్టీసీ వన్ డే టూర్ ప్యాకేజీ

image

ఆర్టీసీ కరీంనగర్-1 డిపో ప్రత్యేక వన్ డే టూర్ ప్యాకేజీని ఏర్పాటు చేసినట్లు డి.ఎం. విజయమాధురి తెలిపారు. ఈ ప్యాకేజీలో బీదర్ జలా నరసింహస్వామి, బీదర్ పోర్టు, జరాసంగం, రేజింతల్ సందర్శన ఉంటుంది. ఈ నెల 14న ఉదయం 3:30 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి కరీంనగర్‌కు చేరుకుంటుంది. టికెట్ ధర పెద్దలకు రూ.1,400, పిల్లలకు రూ.1,080గా నిర్ణయించారు. ఆసక్తి గలవారు డిపోలో సంప్రదించాలని సూచించారు.

News December 9, 2025

మెదటి విడత ఎన్నికల ప్రచారం ముగిసింది: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ మెదటి విడత ఎన్నికలకు 9వ తేది సా. 5 గంటల నుంచి ప్రచారానికి తెరపడనున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. పోలింగ్‌కు 44 గంటల ముందు నుంచి ఆయా మండలాలు, గ్రామాల్లో సైలెన్స్ పీరియడ్ అమలులోకి వస్తుందని తెలిపారు. పోలింగ్ ముగిసే వరకు ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, ఏ విధమైన ప్రచారాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ఎన్నికల ఉల్లంఘనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.