News March 29, 2024
ప్రతిపక్ష పార్టీపై కొప్పుల హాట్ కామెంట్స్
ప్రతిపక్ష పార్టీపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కీలక వ్యాఖ్యలు చేశారు. “పెద్ద షాక్, వాడు పోయిండు, వీడు పోయిండు అనే ఒకటే ఊదరగొడుతుండ్రు. ఇది శిశిర ఋతువు.. పనికిరాని ఆకులన్నీ చెత్తకుప్పలోకి పోతయ్. మూలం మాత్రం స్థిరంగా ఉంటుంది” అని ట్వీట్ చేశారు. మళ్ళీ చైత్రం వస్తది, కొత్త ఆకులు చిగురిస్తాయని, మూలం నుంచి శక్తిని అందుకొని విజృంభిస్థాయన్నారు. ఇది ప్రకృతి సహజం, ప్రతిదానికి షాకైతే ఎలా అని అన్నారు.
Similar News
News January 22, 2025
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు
జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మంగళవారం రూ.1,38,986 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.94,801, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.37,180, అన్నదానం రూ.7,005, వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
News January 22, 2025
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన గ్రామ, వార్డు సభలు. @ వెల్గటూర్ మండలంలో కారు, బైక్ డీ.. ఒకరికి తీవ్ర గాయాలు. @ చొప్పదండిలో షార్ట్ సర్క్యూట్ తో 30 క్వింటాల్ల పత్తి దగ్ధం. @ కోనరావుపేట మండలంలో హనుమాన్ చాలీసా పారాయణం. @ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రులు. @ రేపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్న మంత్రులు ఉత్తమ్, పొన్నం.
News January 21, 2025
సూరమ్మ ప్రాజెక్టును పరిశీలించిన ప్రభుత్వ విప్, సిరిసిల్ల కలెక్టర్
కథలాపూర్ మండలం కలిగోట గ్రామశివారులో నిర్మిస్తున్న సూరమ్మ ప్రాజెక్టును మంగళవారం సాయంత్రం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ఝా పరిశీలించారు. బుధవారం రాష్ట్ర మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ సూరమ్మ ప్రాజెక్టును సందర్శించనున్న నేపథ్యంలో ముందస్తుగా ఏర్పాట్లను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు.