News February 13, 2025

ప్రతిభ కనబరిచిన గుంటూరు పోలీసులు

image

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో ప్రతిభ కనబరిచిన గుంటూరు పోలీసులను గురువారం జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ అభినందించారు. అనంతపురంలోని పోలీసు ట్రైనింగ్ కాలేజీలో నిర్వహించిన పోటీలలో గుంటూరుకు చెందిన ఏడుగురు పోలీసులు మొత్తం 21 పతకాలు సాధించారు వాటిలో 8 బంగారు పతకాలు ఉన్నాయి. ఆయా పోలీసులకు గురువారం ఎస్పీ సతీశ్ కుమార్ చేతుల మీదగా పతకాలు, ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు.

Similar News

News March 26, 2025

ఉగాది పండుగ నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు: చంద్రబాబు

image

ఉగాది పండుగ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం, పురస్కారాల ప్రదానం, సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ మేరకు రూ.5 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉగాది కోసం ఒక్కో జిల్లాకు రూ.10 లక్షలు కేటాయించారు.

News March 26, 2025

తాడేపల్లి: పాస్టర్ ప్రవీణ్ మృతిపై వైఎస్ జగన్ విచారం

image

మత ప్రబోదకుడు, పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై మాజీ సీఎం వైయస్‌ జగన్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బుధవారం తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. పాస్టర్‌, మత ప్రబోదకుడు ప్రవీణ్‌ పగడాల మృతి అత్యంత బాధాకరమని, ప్రవీణ్‌ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపధ్యంలో నిష్పాక్షికంగా విచారణ జరపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రవీణ్‌ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపారు.

News March 26, 2025

ప్ర‌జ‌ల్లో విశ్వాసం పెరిగేలా పోలీసింగ్ ఉండాలి: చంద్రబాబు

image

స‌చివాల‌యంలో బుధవారం జరిగిన క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో పోలీసు శాఖ‌, శాంతిభ‌ద్ర‌త‌ల‌పై చ‌ర్చ జ‌రిగింది. సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర పోలీసు శాఖ‌కు మంచి గుర్తింపు ఉందని, రాష్ట్రంలో జీరో క్రైమ్ ల‌క్ష్యంగా పోలీసు శాఖ వినూత్న ప్ర‌ణాళిక‌ల‌తో కార్యాచ‌ర‌ణ దిశ‌గా అడుగులేయాలన్నారు. ప్ర‌జ‌ల్లో విశ్వాసం పెరిగేలా పోలీసింగ్ ఉండాలన్నారు. ఆధునిక టెక్నాల‌జీ విరివిగా ఉపయోగించుకోవాలన్నారు.

error: Content is protected !!