News July 9, 2024

ప్రతిరోజు 2 లక్షల మందికి పైగా ప్రయాణం: RM KMM

image

ఖమ్మం రీజియన్లో ప్రతిరోజు 517 బస్సులు నడుపుతున్నామని RM సరి రామ్ తెలిపారు. ఆయా బస్సులలో రెండు లక్షల నుంచి 2.30 లక్షల మంది ప్రయాణిస్తున్నారని ఆయన తెలిపారు. మహిళా ప్రయాణికుల కోసం లక్కీ డ్రా నిర్వహిస్తున్నామని చెప్పారు. నెలవారి సీజన్ టికెట్ రిటర్న్, జర్నీ రాయితీ టికెట్, సూపర్ లగ్జరీ చార్జితో లహరి NON AC బస్సు లలో ప్రయాణం వంటి సదుపాయాలు అందిస్తున్నామని వివరించారు.

Similar News

News October 8, 2024

ఖమ్మం: అధికారుల తీరుపై కలెక్టర్ సీరియస్

image

ఖమ్మం జిల్లా అధికారులపై కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ఫైర్ అయ్యారు. గ్రీవెన్స్ డేలో ఖమ్మం అర్బన్ మండలానికి చెందిన విజ్జుదేవి ఉద్యోగానికి కుల సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకుంది. సమయానికి తహశీల్దార్‌ స్వామి మంజూరు చేయకపోవడంతో ఆమె ఉద్యోగం కోల్పోయింది. ‌ఈవిషయాన్ని ఆమె కలెక్టర్ దృష్టికి తేగా ప్రజాసమస్యలు పరిష్కారించడానికి ఉన్నారా.. సమస్యలు సృష్టించడానికి ఉన్నారా అంటూ తహశీల్దార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

News October 8, 2024

చెన్నారంలో శిశువు మృతదేహం కలకలం

image

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని చెన్నారం గ్రామంలో శిశువు మృతదేహం కలకలం రేపింది. గ్రామంలో ఓ వ్యక్తి ఇంటి ఎదుట మంగళవారం తెల్లవారుజామున శిశువు మృతదేహం పడేసి ఉంది. ఈ ఘటన గ్రామంలో చర్చనీయంగా మారింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతదేహన్ని ఎవరైనా తీసుకొచ్చి పడేశారా లేదా కుక్కలు లాక్కొచ్చాయా అనే కోణంలో విచారిస్తున్నారు.

News October 8, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు
∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం& భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యాటన
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} కొత్తగూడెం పట్టణంలో విద్యుత్ సరఫరాల అంతరాయం