News March 24, 2025
ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలి: బాపట్ల కలెక్టర్

పీజీఆర్ఎస్ నమోదైన ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. పీజీఆర్ఎస్ కార్యక్రమం సోమవారం కలెక్టరేట్లో జరిగింది. ప్రజల నుంచి 170 అర్జీలు వచ్చిన్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో తెలిపి, పరిష్కరించకోవచ్చని తెలపారు.
Similar News
News November 19, 2025
జగిత్యాల: అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం

జగిత్యాల కలెక్టరేట్లో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు. వయో వృద్ధుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. వృద్ధుల ఆరోగ్యం, బ్యాంకుల్లో ప్రత్యేక సౌకర్యాలు, చట్టాలపై అవగాహన అవసరమని కలెక్టర్ చెప్పారు. వృద్ధులు తమ సమస్యలు, సూచనలు సమావేశంలో వెల్లడించారు.
News November 19, 2025
రుణాల పంపిణీ లక్ష్యాలను సాధించాలి: కలెక్టర్

బ్యాంకర్లు, జిల్లా అధికారులు సమన్వయంతో కలిసి పనిచేసి జిల్లా లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సూచించారు. రుణాలు పంపిణీలో నిర్దేశిత లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. పంట, హార్టికల్చర్, ముద్ర, ఎస్సీ/ఎస్టీ కార్పొరేషన్, పీఎంఈజీపీ, స్వయం సహాయక బృందాల లింకేజ్, పీఎం స్వనిధి వంటి రుణాల పంపిణీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.
News November 19, 2025
HYD: 18 మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్

నవంబర్ 12 నుంచి 18వరకు జరిగిన ఆపరేషన్లో 11కేసులను ఛేదించి దేశ వ్యాప్తంగా 18మందిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యంగా ట్రేడింగ్ మోసాలను కట్టడి చేస్తూ 15మందిని పట్టుకున్నారు. హెటెరో కంపెనీపై 250 మిలియన్ డాలర్ల భారీ ఎక్స్టోర్షన్కు ప్రయత్నం చేసిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. నకిలీ మెయిల్స్, ఫేక్ USFDA డాక్యూమెంట్లతో గ్యాంగ్ బెదిరించిందన్నారు.


