News March 24, 2025
ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలి: బాపట్ల కలెక్టర్

పీజీఆర్ఎస్ నమోదైన ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. పీజీఆర్ఎస్ కార్యక్రమం సోమవారం కలెక్టరేట్లో జరిగింది. ప్రజల నుంచి 170 అర్జీలు వచ్చిన్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో తెలిపి, పరిష్కరించకోవచ్చని తెలపారు.
Similar News
News November 17, 2025
తగ్గిన రాజన్న కళ్యాణం టికెట్లు.. నిరాశలో భక్తులు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రంలో స్వామివారి నిత్య కళ్యాణం టికెట్లను తగ్గించారు. గతంలో 180 టికెట్ల వరకు జారీ చేయగా, ప్రస్తుతం వాటి సంఖ్యను సగానికి తగ్గించారు. దీంతో శ్రీ స్వామివారి కళ్యాణ సేవలో పాల్గొనడానికి వచ్చిన భక్తులకు నిరాశ మిగులుతోంది. తగినంత స్థలం లేకపోవడం వల్లనే టికెట్లు తగ్గించినట్లు అధికారులు చెబుతున్నారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో కళ్యాణం టికెట్ల కోసం సిఫారసులు పెరిగాయి.
News November 17, 2025
దారులన్నీ భీమన్న గుడివైపే.. భక్తులతో వేములవాడ కిటకిట

కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా భక్తులు వేములవాడ భీమేశ్వరాలయానికి పోటెత్తారు. పవిత్రమైన కార్తీక మాసంలో రాజన్నను దర్శించుకోవాలని వేములవాడకు వచ్చిన భక్తులు అక్కడ దర్శనాలు నిలిపివేయడంతో భీమేశ్వర స్వామివారిని దర్శించుకుంటున్నారు. అభిషేక పూజల్లో పాల్గొని కోడెమొక్కులు సమర్పించుకుంటున్నారు. భీమేశ్వరాలయం వైపు భక్తుల సందడి పెరగగా, జాతర గ్రౌండ్ ప్రాంతంలో చాలావరకు తగ్గిపోయింది.
News November 17, 2025
గొర్రె పిల్లలకు అందించే క్రీపు దాణా తయారీ నమూనా ఫార్ములా

100 కిలోల క్రీపు దాణా తయారీకి కావాల్సిన పదార్థాలు
☛ నలగగొట్టిన మొక్కజొన్నలు 40 కిలోలు ☛ తవుడు 20 కిలోలు ☛ నూనె తీసిన చెక్క 30 కిలోలు ☛ పప్పులపరం 7 కిలోలు ☛ కిలో ఉప్పు ☛ లవణ మిశ్రమం 2 కిలోలు. వీటిని మిక్స్ చేసి క్రీపు దాణా తయారు చేసుకోవచ్చు. ఈ దాణాను గొర్రె పిల్లలకు 3 నుంచి 7 వారాల వరకు తల్లిపాలతో పాటు అందించాలి. దీన్ని గొర్రె పిల్లల శరీర బరువులో ఒకటిన్నర శాతానికి మించకుండా రోజూ అందించాలి.


