News March 24, 2025
ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలి: బాపట్ల కలెక్టర్

పీజీఆర్ఎస్ నమోదైన ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. పీజీఆర్ఎస్ కార్యక్రమం సోమవారం కలెక్టరేట్లో జరిగింది. ప్రజల నుంచి 170 అర్జీలు వచ్చిన్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో తెలిపి, పరిష్కరించకోవచ్చని తెలపారు.
Similar News
News November 14, 2025
పల్నాడు జిల్లాలో పులి, మొసలి కలకలం

పల్నాడు జిల్లాలో పులి, మొసలి సంచారం కలకలం రేపుతోంది. కొద్దిరోజుల క్రితం వెల్దుర్తి మండలం వజ్రాల తండా వద్ద రెండు గేదెల మీద పులి దాడి చేసింది. మాచర్ల రామ టాకీస్ వద్ద చంద్రవంక వాగులో మొసలి సంచరించటం స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. ఈ వాగులో మహిళలు బట్టలు ఉతుకుతూ ఉంటారు. పులిజాడను కనిపెట్టేందుకు ఆటవీశాఖ అధికారులు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. మొసలిని బంధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
News November 14, 2025
జూబ్లీ ఫలితాన్ని గమనిస్తున్న ఖమ్మం జిల్లా ప్రజలు

జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాన్ని ఉమ్మడి ఖమ్మం ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. అధికార కాంగ్రెస్ గెలుస్తుందా?ప్రతిపక్ష బీఆర్ఎస్ గెలుస్తుందా? అని ప్రజలలో ఉత్కంఠ రేపుతుంది. ఈ ఎన్నికల ఫలితాలు స్థానిక ఎన్నికలపై ప్రభావం చూపుతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతుండగా.. గ్రామాల్లో నలుగురు కలిస్తే జూబ్లీ ఫలితంపైనే చర్చిస్తున్నారు. కాంగ్రెస్ విజయం సాధిస్తే ఇదే ఊపుతో స్థానికసంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశముందని టాక్.
News November 14, 2025
జూబ్లీహిల్స్: రెండు రౌండ్లలో కలిపి పోలైన ఓట్లు ఎన్నంటే?

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్లో రెండు రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 1,144 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. రెండు రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థికి 18,617, BRS అభ్యర్థికి 17,473 ఓట్లు పోలయ్యాయి. మరో 8 రౌండ్లు మిగిలి ఉన్నాయి.


