News January 27, 2025
ప్రతి అర్జీకి సంపూర్ణ పరిష్కారం చూపండి: కలెక్టర్

నరసరావుపేట కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన ప్రతి అర్జీని పరిష్కరించాలని కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలోని దూర ప్రాంతాల నుంచి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని నమ్మకంతో కలెక్టరేట్ వరకు దరఖాస్తుదారులు వస్తారన్నారు. రెవిన్యూతో పాటు ఇతర శాఖలకు సంబంధించిన సమస్యలకు నాణ్యమైన పరిష్కారాన్ని ఇవ్వాలని, రీ వెరిఫికేషన్కు రాకుండా చూడాలన్నారు.
Similar News
News November 1, 2025
TODAY HEADLINES

*TG: మంత్రిగా అజహరుద్దీన్ ప్రమాణస్వీకారం
*నష్టపోయిన పంటలకు ఎకరానికి రూ.10 వేలు: సీఎం రేవంత్
*420 హామీలతో ప్రజలను మోసం చేశారు: KTR
*గడువులోగా అమరావతి పనులు పూర్తి కావాలి: CBN
*₹5,244Cr నష్టం.. తక్షణమే సాయం చేయాలని కేంద్రానికి ఏపీ నివేదిక
*AP: ఎన్టీఆర్ వైద్య సేవల పునరుద్ధరణ
*రెండో టీ20లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి
*ప్రో కబడ్డీ లీగ్ విజేత దబాంగ్ ఢిల్లీ
News November 1, 2025
IBM సహకారంతో నేషనల్ ‘AI LAB’

విద్యార్థులను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్లో తీర్చిదిద్దడంలో మరో ముందడుగు పడింది. ‘నేషనల్ AI ల్యాబ్’ ఏర్పాటుకు మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ IBM, AICTE వ్యూహాత్మక ఒప్పందం చేసుకున్నాయి. ఢిల్లీలో ఏర్పాటుకానున్న ల్యాబ్ పరిశోధన, నైపుణ్యం, నూతన ఆవిష్కరణలకు కేంద్రంగా నిలువనుంది. 1000కి పైగా కోర్సుల ద్వారా 30M మందికి AI పరిజ్ఞానం అందనుంది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు తదుపరి తరాన్ని అందించడంలో ఇది దోహదపడనుంది.
News November 1, 2025
భీమారం: రైతులు ఆందోళన చెందొద్దు: కలెక్టర్

భీమారం మండలం కేంద్రంలో తుఫాన్ కారణంగా కురిసిన అకాల వర్షాలకు నేలకొరిగిన వరి పంటలను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. అనంతరం మండలంలోని దేశాయిపేటలో ప్యాక్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. మొలకలు వచ్చిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని భరోసా కల్పించారు.


