News April 4, 2025

ప్రతి ఇంటికి సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి: కలెక్టర్

image

అనకాపల్లి జిల్లాలో సూర్యఘర్ పథకం కింద ఎంపిక చేసిన 5 మోడల్ గ్రామాల్లో ప్రతి ఇంటికి సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో మోడల్ గ్రామాల అభివృద్ధిపై అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. సూర్య ఘర్ పథకం అమల తీరుపై ఆరా తీశారు. సోలార్ ప్లాంట్ కు ముందుకు వచ్చే లబ్ధిదారులకు రుణాలు మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News September 15, 2025

ములుగు: రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతి

image

ములుగులోని ప్రేమ్‌నగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. మృతుడు ఏటూరునాగారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న తిప్పనపల్లి శాంతకుమార్ గా గుర్తించారు. రెండు బైకులు ఢీకొవడంతో శాంతకుమార్ అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని మెరుగైన వైద్యం కోసం వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 15, 2025

VJA: దుర్గమ్మ దర్శనానికి దసరా మొబైల్ యాప్, చాట్‌బాట్

image

ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం రూపొందించిన మొబైల్ యాప్, చాట్‌బాట్‌లను దేవదాయ కమిషనర్ రామచంద్ర మోహన్, ఆలయ EO శీనా నాయక్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సేవలు భక్తులకు ఉపయోగపడతాయని తెలిపారు. కాగా ‘దసరా 2025’ పేరుతో యాప్, 9441820717 నంబర్‌తో చాట్‌బాట్ అందుబాటులోకి వచ్చాయి.

News September 15, 2025

కొడంగల్: సీఎం ఇలాకాలో సిమెంట్ ఫ్యాక్టరీ..!

image

సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ మండలంలోని ధర్మాపూర్ పరిసర ప్రాంతాల్లో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సున్నపు నిక్షేపాలు వెలికి తీసేందుకు డ్రిల్లింగ్ చేసి ల్యాబ్‌కు పంపించారు. ధర్మాపూర్, టేకుల్ కోడ్, గండ్లెపల్లి, ఇందనూర్ పరిసర ప్రాంతాల్లోని ఫారెస్టు, ప్రైవేట్, ప్రభుత్వానికి చెందిన మూడు వేల ఎకరాల్లో సిమెంట్ తయారీకి అవసరమయ్యే నిక్షేపాలున్నట్లు అధికారులు గుర్తించారు.