News January 27, 2025
ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలి: మంత్రి గొట్టిపాటి

విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోమవారం అద్దంకిలో నీటి సంఘాల అధ్యక్షులు, ఎన్ఎస్పీ అధికారులతో సాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. రైతులను సమన్వయం చేసుకొని నియోజకవర్గంలో సాగర్ ఆయకట్టు భూములకు సాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. కాలువలు రిపేర్లు చేయిస్తామన్నారు. ఎన్ఎస్పీ ఎస్ఈ వరలక్ష్మి, ఈఈ రామకృష్ణ, సాగునీటి సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.
Similar News
News February 23, 2026
5,138 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

<
News February 23, 2026
పుచ్చలో తామర, కాయ తొలుచు పురుగుల నిర్మూలన ఎలా?

పుచ్చలో తామర పురుగులు ఆకుల కొనలు, పిందెల నుంచి రసం పీల్చడం వల్ల ఆకులు పైకి పడవ ఆకారంలో తిరిగి పిందెలు నల్లబారుతాయి. వీటి నివారణకు లీటరు నీటికి ఇమిడాక్లాప్రిడ్ 0.4ml కలిపి పిచికారీ చేయాలి. కాయ తొలుచు పురుగులను పుచ్చ పంటలో గుర్తిస్తే వాటి నివారణకు లీటరు నీటికి ప్రొఫెనోఫాస్ 2ml (లేదా) స్పైనోసాడ్ 0.3ml (లేదా) ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రా కలిపి పిచికారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
News February 23, 2026
అతిథి సత్కారాలు ఎలా చేయాలో తెలుసా?

అతిథి సత్కారాలు చేయడమంటే మంచి భోజనం పెట్టి వారి బాగోగులు చూసుకోవడమే కాదట! శాస్త్రాల ప్రకారం అతిథిని ఆహ్వానించేందుకు కొన్ని పద్ధతులున్నాయి. అవి
1.ఇంటిని సుగంధ ద్రవ్యాలతో పరిమళభరితం చేయాలి. 2.అతిథికి స్పష్టమైన వెలుతురునిస్తూ అగ్నిదేవుడి సాక్షిగా ఆహ్వానించాలి. 3.శక్తినిచ్చే పండ్లు, పాలు, తీపి పదార్థాలు అందించాలి. 4.నుదుటిపై తిలకం దిద్ది అక్షతలు వేయాలి. 5. వచ్చిన తర్వాత, వెళ్లేటప్పుడు పూలు ఇవ్వడం.


