News January 27, 2025

ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలి: మంత్రి గొట్టిపాటి

image

విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోమవారం అద్దంకిలో నీటి సంఘాల అధ్యక్షులు, ఎన్ఎస్పీ అధికారులతో సాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. రైతులను సమన్వయం చేసుకొని నియోజకవర్గంలో సాగర్ ఆయకట్టు భూములకు సాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. కాలువలు రిపేర్లు చేయిస్తామన్నారు. ఎన్ఎస్పీ ఎస్ఈ వరలక్ష్మి, ఈఈ రామకృష్ణ, సాగునీటి సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.

Similar News

News December 5, 2025

అనకాపల్లి జిల్లాలో TODAY TOP NEWS

image

➤ జిల్లా వ్యాప్తంగా పాఠశాలలలో మెగా ptm 3.0:ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
➤ జిల్లాలో విద్యుత్ షాక్ ఘటనలో ఇద్దరికీ గాయాలు
➤ నర్సీపట్నంలో అమృత మహిళా క్యాంటీన్ ను ప్రారంభించిన స్పీకర్
➤ నాలుగు కేజీల గంజాయితో తమిళనాడు వాసి అరెస్ట్
➤ పన్ను వసూలు పై నర్సీపట్నం మున్సిపల్ అధికారులు స్పెషల్ డ్రైవ్
➤ బాధ్యతలు స్వీకరించిన నూకాంబిక అమ్మవారి ఆలయ ఈవో
➤ వాడ్రాపల్లిలో మధ్యాహ్న భోజనం పై నిలదీసిన పేరెంట్స్

News December 5, 2025

సంగారెడ్డి డీపీవో సాయిబాబా సస్పెండ్‌

image

సంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) సాయిబాబాపై ప్రభుత్వం వేటు వేసింది. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించినందున ఆయనపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు తెలిసింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి పంచాయతీరాజ్ డైరెక్టర్ శ్రీజన ఉత్తర్వులు జారీ చేశారు.

News December 5, 2025

సీఎం స్టాలిన్‌తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ

image

తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ను ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ నెల 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరు కావాలని ఆయనకు ఆహ్వాన పత్రం అందించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, స్టాలిన్‌తో రాష్ట్ర అభివృద్ధి అంశాలపై చర్చించారు.