News January 27, 2025
ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలి: మంత్రి గొట్టిపాటి

విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోమవారం అద్దంకిలో నీటి సంఘాల అధ్యక్షులు, ఎన్ఎస్పీ అధికారులతో సాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. రైతులను సమన్వయం చేసుకొని నియోజకవర్గంలో సాగర్ ఆయకట్టు భూములకు సాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. కాలువలు రిపేర్లు చేయిస్తామన్నారు. ఎన్ఎస్పీ ఎస్ఈ వరలక్ష్మి, ఈఈ రామకృష్ణ, సాగునీటి సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.
Similar News
News February 9, 2025
మెదక్: నేడు హెల్ప్ డెస్క్ ద్వారా వినతుల స్వీకరణ: కలెక్టర్

10న సోమవారం మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే వినతులు సమర్పించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ప్రజావాణి కార్యక్రమంపై కలెక్టర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సంబంధిత శాఖల జిల్లా అధికారులు విధుల్లో నిమగ్నమై ఉన్నందున అధికారులు ప్రజావాణికి అందుబాటులో ఉండరని తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
News February 9, 2025
విన్నర్గా పార్వతీపురం మన్యం జిల్లా దివ్యాంగుల క్రికెట్ జట్టు

గుంటూరులో నిర్వహించిన పారా క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్లో పార్వతీపురం మన్యం జిల్లా దివ్యాంగుల క్రికెట్ జట్టు శనివారం విన్నర్గా నిలిచింది. ఈ క్రమంలో ముఖ్య అతిథి 2024 పారా ఒలింపిక్ బ్రౌంగ్ మెడలిస్ట్, ఇండియన్ పారా పిస్టల్ షూటర్ రుబీన ఫ్రాన్సిస్ చేతుల మీదగా విన్నర్ ట్రోఫీని ఈ జట్టుకు అందజేశారు. ఈ సందర్భంగా కెప్టెన్ కె.శ్రీను, వైస్ కెప్టెన్ జి.సంతోష్లను, క్రికెట్ జట్టును పలువురు అభినందిస్తున్నారు.
News February 9, 2025
దర్యాప్తు వేగవంతం చేయాలి: ఎస్పీ

జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఉన్న లాంగ్ పెండింగ్ కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయాలని ఎస్పీ రత్న పేర్కొన్నారు. శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలతో ఎస్పీ సమావేశం నిర్వహించారు. కేసుల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడాలని, అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఇప్పటికే అరెస్టు అయిన ముద్దాయిలపై ఛార్జీ షీట్లు దాఖలు చేయాలన్నారు.