News April 25, 2024

‘ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కు వినియోగించుకోవాలి’

image

ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని అదనపు డీఆర్డీఓ నూరుద్దీన్ తెలిపారు. స్వీప్ కార్యాచరణలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల సమాఖ్య సమావేశాలు ఏర్పాటు చేసి, మహిళా సభ్యులకు ఓటు హక్కు వినియోగం, నైతిక ఓటింగ్ పై క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవోలు పాల్గొన్నారు.

Similar News

News December 2, 2025

2వ రోజు 383 నామినేషన్లు దాఖలు.!

image

ఖమ్మం జిల్లాలో 2వ విడత గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. 6 మండలాల్లో సోమవారం సర్పంచ్ల పదవికి 383.. వార్డులకు 895 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆది, సోమవారాల్లో కలిపి కామేపల్లిలో S-49 W-142, KMM(R) S-65 W-167, KSMC S-87 W-153, MGD S-78 W-160, NKP S-70 W-155, T.PLM S-79 W-154 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నేటితో 2వ విడత నామినేషన్ల స్వీకరణ ముగియనుంది.

News December 2, 2025

ఖమ్మం: ఏఎన్‌ఎం కోర్సు ప్రవేశాలకు నేడే ఆఖరు

image

ఖమ్మం టేకులపల్లిలోని దుర్గాబాయి మహిళా-శిశు వికాస కేంద్రంలో 2025-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎంపీహెచ్‌డబ్ల్యూ (మహిళా)/ఏఎన్‌ఎం కోర్సు ప్రవేశాలకు మంగళవారం చివరి గడువు అని మేనేజర్ వేల్పుల విజేత తెలిపారు. ఇంటర్ పూర్తి చేసిన మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చని, ఈ ఉచిత శిక్షణలో బీసీ-సీ, ఈ, ముస్లిం మైనారిటీలకు అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. వివరాలకు 76600 22512ను సంప్రదించవచ్చు.

News December 2, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మం జిల్లాలో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ
∆} పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష
∆} వైరా పర్ణశాలలో ప్రత్యేక పూజలు
∆} మధిరలో Dy.CM భట్టి విక్రమార్క పర్యటన
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
∆} ఖమ్మం జిల్లాకు వర్ష సూచన
∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన