News October 30, 2024
ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలి: కలెక్టర్ నారాయణరెడ్డి

ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని అర్హులకు అందేలా కృషి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. సమీకృత కలెక్టరేట్ భవనంలోని సమావేశ మందిరంలో ఇంటింటికీ సమగ్ర సర్వే నిర్వహించే సూపరింటెండెంట్ల శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ప్రతి పథకాన్ని గ్రామం నుంచి పట్టణం వరకు అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. విధుల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని సూచించారు. జిల్లాకు చెడ్డపేరు తేవొద్దన్నారు.
Similar News
News December 22, 2025
RR: నేడు సర్పంచ్ సాబ్, మేడమ్ వస్తున్నారు!

సర్పంచ్లు, వార్డు సభ్యులు నేడు వారి వారి గ్రామపంచాయతీల్లో ప్రమాణం చేయనున్నారు. రంగారెడ్డి జిల్లాలో 3 విడతల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 526 GPలకు 525 గ్రామాల్లో కొత్త పాలకవర్గాలను ఎన్నుకున్నారు. నేడు వారితో పంచాయతీ సెక్రటరీలు ప్రమాణం చేయిస్తారు. కాగా జిల్లాలో మాడ్గుల మండలంలోని నర్సంపల్లి GPకి ఎన్నిక జరగలేదు. ప్రమాణ స్వీకారంపై జిల్లాలోని MPDOలు ఇప్పటికే స్పష్టత ఇచ్చారు.
News December 22, 2025
అజ్మీర్ దర్గా ఉర్సుకు కేసీఆర్ చాదర్ సమర్పణ

అజ్మీర్ దర్గా ఉర్సు ఉత్సవాల సందర్భంగా ప్రతి ఏడాది పార్టీ తరఫున చాదర్ సమర్పించే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ఈ సంవత్సరం కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాదర్ సమర్పించారు. కార్యక్రమంలో మాజీ హోం మంత్రి మహమూద్ అలీతో పాటు పార్టీ మైనారిటీ విభాగానికి చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు. అజ్మీర్ దర్గా ఉర్సు ఉత్సవాలు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు.
News December 21, 2025
HYD: రేపు నాట్కో పరిశ్రమలో ‘మాక్ ఎక్సర్సైజ్’

ప్రకృతి విపత్తులు, అగ్ని ప్రమాదాల వేళ అనుసరించాల్సిన రక్షణ చర్యలపై అవగాహన కల్పించేందుకు ఈనెల 22న మేకగూడలోని నాట్కో పరిశ్రమ ఆవరణలో ‘మాక్ ఎక్సర్సైజ్’ నిర్వహించనున్నట్లు కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ప్రమాద సమయాల్లో ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు ముందస్తు సన్నద్ధత అవసరమని, అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలనే అంశంపై సిబ్బందికి, అధికారులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తామని వెల్లడించారు.


