News March 8, 2026
ప్రతి కరెంట్ స్తంభానికి ‘యూనిక్’ నెంబర్: ఖమ్మం ఎస్ఈ

ఖమ్మం జిల్లాలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి జీఐఎస్ మ్యాపింగ్ వ్యవస్థను తీసుకొచ్చినట్లు ఎస్ఈ శ్రీనివాసాచారి తెలిపారు. 33 కేవీ లైన్లలో 55 ఫీడర్లు, 11 కేవీ లైన్లలో 545 ఫీడర్లకు యూనిక్ పోల్ నెంబర్లు కేటాయించారు. దీనివల్ల సమస్యలు వచ్చినప్పుడు పోల్ నెంబర్ ద్వారా లొకేషన్ గుర్తించి, యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయవచ్చని వివరించారు. ఈ టెక్నాలజీతో విద్యుత్ అంతరాయాలకు చెక్ పడనుంది.
Similar News
News April 13, 2026
రేపు ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవు

అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. రేపు మార్కెట్లో అన్ని రకాల క్రయవిక్రయాలు నిలిపివేయబడతాయని పేర్కొన్నారు. తిరిగి బుధవారం నుంచి మార్కెట్ కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతాయని, రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని మార్కెట్ పాలకవర్గం ఒక ప్రకటనలో కోరింది.
News April 13, 2026
రేపు ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవు

అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. రేపు మార్కెట్లో అన్ని రకాల క్రయవిక్రయాలు నిలిపివేయబడతాయని పేర్కొన్నారు. తిరిగి బుధవారం నుంచి మార్కెట్ కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతాయని, రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని మార్కెట్ పాలకవర్గం ఒక ప్రకటనలో కోరింది.
News April 13, 2026
ఖమ్మం: ఫీజు చెల్లింపునకు 20వరకు అవకాశం

ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో ఫెయిలైన విద్యార్థులు ఈనెల 20వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలని డీఐఈవో కె.రవిబాబు సూచించారు. వచ్చే నెల 13 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఈమేరకు ఈనెల 20లోగా ఆయా కళాశాలల్లో ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. అలాగే, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం కూడా ఈనెల 20వరకు tgbie.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.


