News October 3, 2024
ప్రతి గ్రామాన్ని స్వచ్ఛత గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలి: కలెక్టర్
శ్రీ సత్యసాయి జిల్లాలోని ప్రతి గ్రామాన్ని స్వచ్ఛత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడు కృషి చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. బుధవారం పుట్టపర్తి రూరల్ మండల పరిధిలోని కప్పల బండలో జరిగిన స్వచ్ఛత హి సేవ ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో గ్రామస్తుల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమన్నారు.
Similar News
News October 3, 2024
అనంతపురంలో కిలో టమాటా రూ.74
టమాటా ధరలు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా అనంతపురంలో కిలో రూ.70కి పైగా పలుకుతోంది. మూడో రకం సైతం రూ.50 పలుకుతుండటం విశేషం. నిన్న కక్కలపల్లి టమాటా మార్కెట్కు 675 టన్నులు రాగా గరిష్ఠంగా కిలో రూ.74, రెండో రకం రూ.65తో విక్రయాలు సాగాయి. 15 కిలోల బుట్ట నాణ్యతను బట్టి రూ.750 నుంచి రూ.1,110 వరకు పలుకుతోందని మార్కెట్ కార్యదర్శి రాంప్రసాద్ తెలిపారు. టమాటా కొనాలంటేనే సామాన్యులు భయపడే పరిస్థితి నెలకొంది.
News October 2, 2024
హెచ్ఎల్సీ కెనాల్లో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
బీ.సముద్రం మండల పరిధిలో ఉన్న హెచ్ఎల్సీ కెనాల్లో గుర్తుతెలియని మగ మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెడీమేడ్ ఫుల్ షర్ట్పైన నలుపు, తెలుపు రంగు చుక్కలు, డార్క్ బ్లూ కలర్ జీన్స్ దుస్తులు ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. కీప్యాడ్ ఫోన్, ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఉందన్నారు. గుర్తించి వారు సీఐ 9440796816 నంబర్కు సంప్రదించాలని కోరారు.
News October 2, 2024
కాస్త ఓపిక పట్టు కేతిరెడ్డీ.. నీ గుట్టు విప్పుతా: మంత్రి సత్యకుమార్ యాదవ్
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసిన విమర్శలపై మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. ‘పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్న సామెత మీకు సరిగ్గా వర్తిస్తుంది కేటురెడ్డీ.. కబ్జా కమీషన్, కలెక్షన్ కరప్షన్లకు కేరాఫ్ అడ్రస్ నువ్వు. కమీషన్లు లేక మైండ్ బ్లాక్ అయినట్లు ఉంది. కాస్త ఓపిక పట్టు నీ దారుణాలు గుట్టు విప్పుతా’ అంటూ ఘాటుగా స్పందించారు.