News December 4, 2024

ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తాం : మంత్రి

image

ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. బుధవారం ఘంటసాల మండలం లంకపల్లి గ్రామంలో రహదారి వెంబడి ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించి రైతుతో మాట్లాడారు. తుఫాను నేపథ్యంలో కొంత ఇబ్బంది కలిగిందని, రైతులు భయపడవద్దని ఆయన తెలిపారు. మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయకపోతే మా దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ పాల్గొన్నారు.

Similar News

News January 23, 2025

జిల్లాను పున‌రుత్పాద‌క ఇంధ‌న హ‌బ్‌గా తీర్చిదిద్దుదాం: కలెక్టర్

image

ఎన్‌టీఆర్ జిల్లాను పున‌రుత్పాద‌క ఇంధ‌న హ‌బ్‌గా తీర్చిదిద్దే బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మంలో ప్ర‌తిఒక్క‌రూ భాగ‌స్వాములు కావాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ పిలుపునిచ్చారు. విద్యుత్ శాఖ‌, ఆధ్వ‌ర్యంలో ఎనికేపాడులో జ‌రిగిన పీఎం సూర్య‌ఘ‌ర్ ముఫ్త్ బిజిలీ యోజ‌న జ‌న‌జాగృతి ర్యాలీలో క‌లెక్ట‌ర్ పాల్గొన్నారు. సూర్య‌ఘ‌ర్ ప‌థ‌కం ద్వారా స్థానిక నివాసి ఆర్‌. వీర‌ రాఘ‌వ‌య్య ఏర్పాటు చేసుకున్న సోలార్ ప్యానెల్‌ను పరిశీలించారు. 

News January 23, 2025

విజయవాడ పోలీసులకు చంద్రబాబు అభినందనలు

image

విజయవాడ పోలీసు చర్యలను సీఎం చంద్రబాబు అభినందించారు. Suraksha For Safer Neighbourhoods చొరవ అభినందనీయమని కొనియాడారు. వెయ్యికంటే ఎక్కువ సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ప్రాముఖ్యత చాటుతోందని చెప్పారు. ఈ తరహా పోలీసింగ్ పరిపాలన ప్రజలకు మెరుగైన సేవ చేస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. హైటెక్ ఈగల్ వెహికల్స్ ప్రారంభించడం కూడా ఆయన అభినందించారు. 

News January 23, 2025

VJA: బాలికపై అత్యాచారం.. పదేళ్ల జైలు శిక్ష

image

అత్యాచారం చేసిన వ్యక్తికి పదేళ్ల జైలుశిక్ష విధిస్తూ HYDలోని ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. పీపీ వివరాల మేరకు మియాపూర్‌కు చెందిన బాలిక(16)కు రమేష్ పరిచయమయ్యాడు. దీంతో ఆమెను విజయవాడ తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం గదిలో బంధించి అత్యాచారం చేసి ఇంటి వద్ద వదిలి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి.. చార్జీషీటు వేయగా కోర్టు తీర్పునిచ్చింది.