News April 5, 2025
ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి: సీఎం

రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి సీఎం చంద్రబాబు కార్యాచరణ ఆదేశాలు జారీ చేశారు. వెలగపూడిలో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే 70 నియోజకవర్గాల్లో 100 పడకలపైగా ఆస్పత్రులు ఉన్నాయని, మిగిలిన 105 ప్రాంతాల్లో త్వరితంగా ఆస్పత్రుల నిర్మాణం చేపట్టాలని సూచించారు. PPP పద్ధతిలో ఆస్పత్రులు నిర్మించి పరిశ్రమల తరహాలో సబ్సిడీలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
Similar News
News November 14, 2025
గుంటూరు మిర్చి యార్డులో ధరలో ఇలా.!

గుంటూరు మిర్చి యార్డుకు గురువారం 48,406 మిర్చి టిక్కీలు విక్రయానికి వచ్చాయని గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నతశ్రేణి కార్యదర్శి చంద్రిక తెలిపారు. ముందురోజు నిల్వ ఉన్న వాటితో కలిపి 47,533 అమ్మకం జరిగాయని ఇంకా యార్డు ఆవరణలో 13,564 మిర్చి టిక్కీలు నిల్వ ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. వివిధ రకాల మిరపకాయలకు ధరలు పలు విధాలుగా నమోదయ్యాయన్నారు.
News November 14, 2025
మాతృ మరణాల నివారణే ప్రధాన లక్ష్యం: కలెక్టర్

గుంటూరు జిల్లాలో మాతృ మరణాలు జరగకుండా అన్ని వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఆదేశించారు. హైరిస్క్ గర్భిణులను నిరంతరం పర్యవేక్షించి, సకాలంలో వైద్యం అందించాలని సూచించారు. ఆరోగ్య పరీక్షలు, పౌష్టికాహారం, రక్తహీనత నివారణపై అవగాహన కల్పించాలన్నారు. సమష్టిగా కృషి చేసి మాతృ మరణాలు నివారించాలని ఆమె పిలుపునిచ్చారు.
News November 13, 2025
10 రోజుల్లో పీఎఫ్ సమస్యలు పరిష్కరించాలి: APTF

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న ఉపాధ్యాయులు, ప్రదానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారుల పీఎఫ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీటీఎఫ్ విజ్ఞప్తి చేసింది. ఇదే అంశంపై జిల్లా అధ్యక్ష, కార్యదర్శి బసవలింగారావు, ఖాలీద్ గురువారం జడ్పీ ఛైర్పర్సన్ క్రిస్టీనాను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. 10 రోజుల్లో సమస్య పరిష్కారం చేయకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.


