News February 18, 2025
ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారి: కలెక్టర్

స్వర్ణాంధ్ర-2047 విజన్ ప్లాన్లో భాగంగా నియోజకవర్గ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి నియోజకవర్గ, మండల అభివృద్ధి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికలపై సమీక్ష నిర్వహించారు. ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించామన్నారు.
Similar News
News January 3, 2026
తప్పుల్లేని ఓటర్ల జాబితాను రూపొందించాలి: కలెక్టర్

ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ ప్రక్రియను అధికారులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. శనివారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ.. బీఎల్ఓలు ప్రతిరోజూ 30 నుంచి 40 ఎంట్రీలు చేస్తూ, ఇంటింటి సర్వే ద్వారా తప్పుల్లేని జాబితా సిద్ధం చేయాలన్నారు.
News January 3, 2026
HYD: లీకేజీలను గుర్తించేంచుకు ‘రోబోటిక్’ టెక్నాలజీ

HYDలో కలుషిత నీటి సరఫరాను అరికట్టేందుకు జలమండలి ప్రత్యేక కార్యాచరణ ప్రకటించింది. గత రెండేళ్లలో అందిన ఫిర్యాదులను విశ్లేషించి, కలుషిత నీటి సమస్య అధికంగా ఉన్న ప్రాంతాల్లో రెండు నెలల్లోగా పాత పైప్లైన్లను మార్చాలని ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. లీకేజీలను త్వరితగతిన గుర్తించేందుకు ‘రోబోటిక్ టెక్నాలజీ’ని వాడుతున్నారు. ఫిర్యాదులను ‘జీరో’ స్థాయికి తీసుకురావడమే లక్ష్యంగా అధికారులు పనులు చేపట్టారు.
News January 3, 2026
ఉత్తమ్కు డాక్టరేట్ ఇవ్వాల్సిందే అధ్యక్షా: రేవంత్

TG: నీటి వివాదాల అంశం ఎంతో క్లిష్టమైనదని అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం రేవంత్ అన్నారు. ‘బీఆర్ఎస్ ఆరోపణల నేపథ్యంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృష్ణా జలాల వివాదంపై చాలా స్టడీ చేశారు. ఈ చదువు ఆయన గతంలోనే చదివితే నాలుగు సార్లు ఐఏఎస్ అయ్యేవారు అధ్యక్షా. ఇప్పటికైనా మీరు రికమండ్ చేసి అంబేడ్కర్ వర్సిటీ నుంచి డాక్టరేట్ ఇప్పించాల్సిందే అధ్యక్షా’ అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.


