News April 4, 2025
ప్రతి మహిళా లక్షాధికారి కావాలి: పార్వతీపురం కలెక్టర్

జిల్లాలోని స్వయం సహాయక బృందాల్లోని ప్రతి మహిళ లక్షాధికారి కావాలని, ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఏపీడీలు, ఏపీఎంలను ఆదేశించారు. జిల్లాలో దాదాపు 2 లక్షల 30 వేల మంది మహిళా సభ్యులు ఉండగా, వారిలో సగానికి పైగా లక్ష లోపు వార్షికాదాయం ఉందన్నారు. అటువంటి వారిని గుర్తించి, వారితో అనుకూలంగా ఉండే వ్యాపారాలను చేపట్టి ప్రతి మహిళను లక్షాధికారునిగా తీర్చిదిద్దాలని అన్నారు.
Similar News
News February 28, 2026
ధర్మపురిలో భక్తులకు ఉచిత భోజనం ప్రారంభం

ధర్మపురి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని రాష్ట్ర మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శనివారం ధర్మపురిలో టీటీడీ కల్యాణ మండపంలో బ్రహ్మోత్సవాలకు వస్తున్న భక్తులకు ఉచిత భోజన పథకాన్ని కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి మంత్రి ప్రారంభించారు. మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి, వైస్ చైర్మన్ వెంకన్న, ఆలయ కమిటీ చైర్మన్ జక్కు రవీందర్, నాయకులు దినేష్ పాల్గొన్నారు.
News February 28, 2026
KNR: బొట్టు పెట్టి.. మత్తు చల్లి.. నిలువు దోపిడీ!

కరీంనగర్ జిల్లాలో మాయగాళ్లు మత్తుమందుతో ముంచేస్తున్నారు. భక్తుల వేషంలో ఇళ్ల వద్దకు వచ్చి, కష్టాలు తీరుస్తామంటూ మాయమాటలు చెబుతున్నారు. నుదిటిపై బొట్టు పెడుతున్నట్లు నటించి.. ముక్కు వద్ద మత్తుమందు చల్లి క్షణాల్లో స్పృహ కోల్పోయేలా చేస్తున్నారు. తాజాగా రేకుర్తి, హౌసింగ్ బోర్డు కాలనీలతో పాటు, హుజూరాబాద్ పరిసరాల్లోనూ ఇలాంటి మోసాలు వెలుగుచూశాయి. అపరిచితులను నమ్మవద్దని, జాగ్రత్తగా ఉండాలన్నారు.
News February 28, 2026
వేసవి కాలంలో రక్తదానం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

వేసవి కాలంలో రక్తదానం చేసేవారు హైడ్రేటెడ్గా ఉండటం ముఖ్యం. ఇందుకోసం రక్తదానానికి ముందు, తర్వాత పుష్కలంగా నీరు తాగాలి. పండ్ల రసాలు, గ్లూకోజ్ పానీయాలు తీసుకుంటే తక్షణ శక్తి లభిస్తుంది. రక్తదాన కేంద్రానికి వెళ్లేటప్పుడు ఎండ తగలకుండా గొడుగు/టోపీ/స్కార్ఫ్ ధరించాలి. బ్లడ్ ఇచ్చిన తర్వాత 15-20min రెస్ట్ తీసుకోవాలి. భారీ శారీరక శ్రమకు దూరంగా ఉండాలి. ఆకుకూరలు, పప్పులు, ఖర్జూర వంటివి ఆహారంగా తీసుకోవాలి.


