News September 8, 2024

ప్రతి రైతును ఆదుకుంటాం: మంత్రి బీసీ

image

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. సంజామల పాలేరు వాగు పరివాహక ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలను మంత్రి శనివారం పరిశీలించారు. రైతులు ఆందోళన చెందొద్దని భరోసా ఇచ్చారు. పంట నష్టపరిహారంపై సమగ్ర నివేదిక తయారు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.

Similar News

News October 28, 2025

సిద్ధంగా ఉంచండి: కలెక్టర్

image

మొంథా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ సిరి పేర్కొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలకు పంపేందుకు అసరమైన ఉద్యోగులు, సిబ్బంది, సామగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ప్రమాదకర వంతెనల వద్ద సిబ్బందిని ఉంచడంతో పాటు వెంటనే మరమ్మతులు చేసేందుకు గుత్తేదారులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.

News October 27, 2025

ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి: కలెక్టర్

image

ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి హౌసింగ్, పీజీఆర్ఎస్ తదితర అంశాలపై మండల స్పెషల్ ఆఫీసర్లు, డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

News October 27, 2025

ఆయుధాలపై విద్యార్థులకు ఎస్పీ అవగాహన

image

పోలీసులు వినియోగించే ఆయుధాలు, సాధనాల పట్ల విద్యార్దులు అవగాహన కల్గి ఉండటం మంచిదని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. సోమవారం జిల్లా డీపీఓలో ఏర్పాటుచేసిన పోలీస్ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని విద్యార్థులతో కలిసి ఎస్పీ పరిశీలించారు. పోలీసు అమర వీరులను ప్రతి ఒక్కరం స్మరించుకుందాం అన్నారు. ప్రజల్లో పోలీసు వ్యవస్థ పట్ల విశ్వాసం పెంపొందించామన్నారు.