News April 8, 2025

ప్రతి వసతి గృహంలో సీసీ కెమెరాలు ఉండాలి: కలెక్టర్

image

పార్వతీపురం మన్యం జిల్లాలోని ప్రతి వసతి గృహంలో నెల రోజుల్లోగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి విద్యార్థుల నడవడికలను గమనించాలని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ వసతి గృహ సంక్షేమాధికారులను ఆదేశించారు. వసతి గృహంలో చదివే విద్యార్థులకు క్రమశిక్షణ ముఖ్యమని, ఆ దిశగా విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణ, విద్యాబుద్ధులు నేర్పాలని వివరించారు. సంబంధిత అధికారులతో కలెక్టరేట్‌లో సమీక్షించారు.

Similar News

News December 1, 2025

రెవిన్యూ సమస్యలు పరిష్కరించండి: అల్లూరి కలెక్టర్

image

గ్రామాల్లో నెలకొన్న రెవిన్యూ సమస్యలు మండల స్థాయిలో పరిష్కరించాలని కలెక్టర్ దినేష్ కుమార్ తహశీల్దార్‌లను ఆదేశించారు. రంపచోడవరంలో చింతూరు, రంపచోడవరం డివిజన్‌ల రెవిన్యూ అధికారులతో సోమవారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. ప్రతీ వారం తన వద్దకు 60 సమస్యలు ఈ ప్రాంతం నుంచి వస్తున్నాయని అన్నారు. అన్నిటిని ఇక్కడే పరిష్కరించడానికి అధికారులు కృషి చేయాలన్నారు.

News December 1, 2025

ఈ నెల 5న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్: కలెక్టర్

image

మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్‌ను ఈనెల 5వ తేదీన నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా తెలిపారు. సోమవారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం సమీక్ష నిర్వహించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలో సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.‌ అదేవిధంగా సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా పట్టణాలు, గ్రామాల్లో పారిశుధ్ధ్య కార్యక్రమాలను నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.

News December 1, 2025

పాతబస్తీ మెట్రోకు రూ.125 కోట్లు మంజూరు

image

పాతబస్తీ మెట్రోకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.125 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించింది. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ నిధులకు అనుమతులు వచ్చినట్లుగా అధికారులు పేర్కొన్నారు. పాతబస్తీ మెట్రోను మరింత వేగంగా నిర్మించడం కోసం ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు.