News April 8, 2025
ప్రతి వసతి గృహంలో సీసీ కెమెరాలు ఉండాలి: కలెక్టర్

పార్వతీపురం మన్యం జిల్లాలోని ప్రతి వసతి గృహంలో నెల రోజుల్లోగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి విద్యార్థుల నడవడికలను గమనించాలని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ వసతి గృహ సంక్షేమాధికారులను ఆదేశించారు. వసతి గృహంలో చదివే విద్యార్థులకు క్రమశిక్షణ ముఖ్యమని, ఆ దిశగా విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణ, విద్యాబుద్ధులు నేర్పాలని వివరించారు. సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో సమీక్షించారు.
Similar News
News February 26, 2026
వంటింటి చిట్కాలు

* బత్తాయి, నారింజ పండ్లను మైక్రోఓవెన్లో కొన్ని సెకన్ల పాటు ఉంచితే తొక్క సులభంగా వస్తుంది.
* కాకరకాయ కూరలో సోంపు గింజలు/బెల్లం వేస్తే చేదు తగ్గుతుంది.
* అరటిపండ్లను ప్లాస్టిక్ డబ్బాలో వేసి ఫ్రిజ్లో పెడితే నల్లగా మారవు.
* ఐస్ క్యూబ్స్ వేసిన నీళ్లలో ఉడికించిన బంగాళదుంపలు వేసి, తర్వాత తొక్కలు తీస్తే సులువుగా వస్తాయి.
* పోపు గింజలు వేయించి నిల్వ చేస్తే పాడవకుండా ఉంటాయి.
News February 26, 2026
VKB జిల్లా అడిషనల్ కలెక్టర్గా ఉమశంకర్ ప్రసాద్

వికారాబాద్ జిల్లా స్థానిక సంస్థల జిల్లా అడిషనల్ కలెక్టర్గా ఉమాశంకర్ ప్రసాద్ నియమితులయ్యారు. ఇదివరకు తాండూరు సబ్ కలెక్టర్గా పని చేస్తున్న ఉమాశంకర్ ప్రసాద్కు నారాయణపేట జిల్లా ఎఫ్ఏసీ అడిషనల్ కలెక్టర్గా ఇదివరకు బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా జరిగిన బదిలీల్లో తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ను వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
News February 26, 2026
షాకింగ్.. కుక్క నాకడంతో కాళ్లు, చేతులు కోల్పోయిన మహిళ!

రేబీస్ సోకిన కుక్కలు కరవడం వల్లే కాకుండా పెంపుడు కుక్కలు నాకినా కొన్నిసార్లు ఇబ్బందులు తప్పవు. UKకు చెందిన మంజీత్ సంఘ(56) చావు అంచుల వరకు వెళ్లొచ్చారు. ఆస్పత్రిలో 32 వారాలు ఉండి, పలుమార్లు గుండెపోట్లను ఎదుర్కొని కాళ్లు, చేతులను కోల్పోయి ఇంటికి చేరారు. ఈమె కాలికి ఉన్న ఓ గాయాన్ని కుక్క నాకడంతో ‘సెప్సిస్’ వ్యాధి వచ్చి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. ఇది అరుదైనప్పటికీ జాగ్రత్తగా ఉండాలంటున్నారు.


