News April 8, 2025

ప్రతి వసతి గృహంలో సీసీ కెమెరాలు ఉండాలి: కలెక్టర్

image

పార్వతీపురం మన్యం జిల్లాలోని ప్రతి వసతి గృహంలో నెల రోజుల్లోగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి విద్యార్థుల నడవడికలను గమనించాలని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ వసతి గృహ సంక్షేమాధికారులను ఆదేశించారు. వసతి గృహంలో చదివే విద్యార్థులకు క్రమశిక్షణ ముఖ్యమని, ఆ దిశగా విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణ, విద్యాబుద్ధులు నేర్పాలని వివరించారు. సంబంధిత అధికారులతో కలెక్టరేట్‌లో సమీక్షించారు.

Similar News

News November 24, 2025

ఆ మద్యం దుకాణాన్ని తొలగించండి: నంద్యాల కలెక్టర్

image

నవంబర్ 7న జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో ప్రతినిధులు ప్రస్తావించిన అంశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. నందికొట్కూరు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలోని మద్యం దుకాణం విద్యార్థుల్లో చెడు అలవాట్లకు దారితీస్తోందని ఫిర్యాదులు వచ్చాయన్నారు. మద్యం దుకాణాన్ని తొలగించే చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.

News November 24, 2025

HYD: జాతీయ శిక్షణకు బాలికలకు అవకాశం

image

రంగారెడ్డి జిల్లాలో 12-16 ఏళ్ల బాలికల కోసం ఖేలో ఇండియా అథ్లెటిక్స్ లీగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. 60M, 600M, లాంగ్ జంప్, హై జంప్, జావెలిన్ త్రో, షాట్ పుట్ ఈవెంట్లలో పాల్గొనేందుకు ఆసక్తి గలవారు ఈ నెల 28న సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఉ.8 గం.కు రిపోర్ట్ చేయాలి. రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితం. జిల్లా స్థాయిలో అర్హత సాధించిన వారికి జాతీయ స్థాయి క్యాంపులో ప్రత్యేక శిక్షణ లభిస్తుంది.

News November 24, 2025

అధిక ధరలకు అమ్మితే కాల్ చేయండి!

image

బస్‌స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, సూపర్ మార్కెట్స్ వంటి చోట్ల కొందరు MRP కంటే అధిక ధరలకు వస్తువులు అమ్ముతుంటారు. అలాంటి సమయంలో ప్రశ్నించడం వినియోగదారుడిగా నీకున్న హక్కు. ఒకవేళ ఎవరైనా అధిక ధర వసూలు చేస్తే అది చట్ట ప్రకారం నేరం. ఇలాంటి మోసాలను వెంటనే నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్ నం.1915కు కాల్ లేదా WhatsApp No 8800001915కు మెసేజ్ చేసి కంప్లైంట్ చేయొచ్చు. SHARE IT