News April 8, 2025
ప్రతి వసతి గృహంలో సీసీ కెమెరాలు ఉండాలి: కలెక్టర్

పార్వతీపురం మన్యం జిల్లాలోని ప్రతి వసతి గృహంలో నెల రోజుల్లోగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి విద్యార్థుల నడవడికలను గమనించాలని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ వసతి గృహ సంక్షేమాధికారులను ఆదేశించారు. వసతి గృహంలో చదివే విద్యార్థులకు క్రమశిక్షణ ముఖ్యమని, ఆ దిశగా విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణ, విద్యాబుద్ధులు నేర్పాలని వివరించారు. సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో సమీక్షించారు.
Similar News
News November 25, 2025
మిరపలో జెమిని వైరస్ను ఈ లక్షణాలతో గుర్తించండి

వాతావరణ మార్పుల కారణంగా కొన్నిచోట్ల మిరపలో జెమిని వైరస్ కనిపిస్తోంది. ఇది ఆశించిన మొక్కల ఆకులు చిన్నవిగా మారి పైకి ముడుచుకొని పడవ ఆకారంలో ఉంటాయి. ఆకుల ఈనెలు ఆకుపచ్చగాను, ఈనెల మధ్య లేత ఆకుపచ్చగా లేదా పసుపు పచ్చగా మారుతాయి. కణుపుల మధ్య దూరం తగ్గుతుంది. ఈ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది. దీనికి తోడు కొన్నిచోట్ల పచ్చదోమ కూడా కనిపిస్తోంది. దీని వల్ల మొక్క పెరుగుదల, దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది.
News November 25, 2025
మిరపలో జెమిని వైరస్ను ఎలా నివారించాలి?

జెమిని వైరస్ నివారణకు ముందుజాగ్రత్తగా రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారించాలి. వ్యాధిసోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. పొలంలో కలుపు మొక్కలను తీసివేయాలి. పసుపు రంగు జిగురు అట్టలను ఎకరాకు 8 నుంచి 10 అమర్చితే రసం పీల్చే పురుగుల ఉద్ధృతి తగ్గుతుంది. జెమిని వైరస్ నివారణకు లీటరు నీటికి పైరిప్రాక్సిపెన్ 1.5ml లేదా పైరిప్రాక్సిపెన్ + ఫెన్ప్రోపాత్రిన్ 1ml మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
News November 25, 2025
తిరుమల పరకామణి కేసు.. భూమనకు నోటీసులు

AP: తిరుమల పరకామణి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణకు హాజరు కావాలంటూ టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి సీఐడీ నోటీసులు ఇచ్చింది. ఇవాళ ఉదయం ఆయన నివాసానికి వెళ్లిన అధికారులు సాయంత్రం 4 గంటలకు విచారణకు రావాలంటూ నోటీసులు అందజేశారు.


