News January 22, 2025

ప్రతి విద్యార్థికి అపార్ ఐడీ తప్పనిసరి:  భూపాలపల్లి డీఈవో

image

దేశ పౌరులకు ఆధార్ కార్డు ఏ విధంగా ఉంటుందో ప్రతి విద్యార్థికి అపార్(ఆటోమోటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) ఐడీ కూడా తప్పనిసరిగా ఉండాలని భూపాలపల్లి జిల్లా విద్యాధికారి రాజేందర్ అన్నారు. ఈ మేరకు ఆయన కాటారం మండలంలోని తెలంగాణ గిరిజన, గురుకుల పాఠశాలలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు ఏర్పాటుచేసిన అపార్ వర్క్ షాప్‌ను బుధవారం పరిశీలించారు. పలువురు జిల్లా, మండలాధికారులు పాల్గొన్నారు.

Similar News

News November 20, 2025

కాకినాడ జీజీహెచ్‌లో వృద్ధులకు ‘ఆదివారం’ ప్రత్యేక ఓపీ

image

రాష్ట్రంలోనే తొలిసారిగా కాకినాడ ప్రభుత్వాసుపత్రి (జీజీహెచ్‌)లో వయోవృద్ధుల కోసం ప్రత్యేక ఓపీ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి తెలిపారు. ఈ నెల 23 నుంచి ప్రతి ఆదివారం 65 ఏళ్లు పైబడిన వారికి ఓపీ నంబర్-4లో రిటైర్డ్ ప్రొఫెసర్లు వైద్యం అందిస్తారన్నారు. చికిత్స కోసం వచ్చే వారు ఆధార్‌ కార్డు తీసుకురావాలని, పరీక్షలతో పాటు ఉచితంగా మందులు అందజేస్తామని ఆమె వెల్లడించారు.

News November 20, 2025

రేగుపాలెం: యాక్సిడెంట్.. ఇద్దరికి తీవ్ర గాయాలు

image

ఎలమంచిలి మండలం రేగుపాలెం సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. తుని నుంచి అనకాపల్లి వైపు వెళుతున్న బైక్, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ బోల్తా పడడంతో దానిపై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వీరు ఎలమంచిలి మున్సిపాలిటీ కొత్త ఎర్రవరం గ్రామానికి చెందిన వారిగా సమాచారం. ఈ ఘనటపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News November 20, 2025

మరో ఉగ్ర దాడికి జైషే కుట్ర?

image

పాక్ ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ మన దేశంలో మరో దాడికి కుట్ర చేస్తోందని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఆత్మాహుతి స్క్వాడ్‌ను సిద్ధం చేస్తోందని హెచ్చరించాయి. ‘ఇందుకోసం జైషే నాయకులు డిజిటల్ మార్గాల్లో నిధుల సేకరణకు పిలుపునిచ్చారు. ₹6,400 చొప్పున ఇవ్వాలని అడుగుతున్నారు. వారు మహిళల నేతృత్వంలో దాడికి కుట్ర పన్నుతున్నారు’ అని తెలిపాయి. ఢిల్లీ పేలుడు ఘటనలో జైషే హస్తం ఉందని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.