News March 28, 2025
ప్రతి విద్యార్థి వివరాలు పక్కాగా ఉండాలి: మన్యం కలెక్టర్

విద్యా సంస్థలలో చదువుతున్న ప్రతి విద్యార్థికి సంబంధించిన వివరాలు పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. విద్యా శాఖపై శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సమీక్షించారు. బడి ఈడు పిల్లలు విధిగా పాఠశాలల్లో ఉండాలన్నారు. పిల్లలు బడి బయట ఉంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Similar News
News February 26, 2026
అమరావతికి భారీగా నిధులు

అమరావతి రాజధాని అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.1,400 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి (సీఆర్డీఏ) శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రెండు, మూడో త్రైమాసికాలకు గాను ఈ నిధులను కేటాయించారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రుణాల కింద ఏపీ సీఆర్డీఏ పీడీ ఖాతాలో ఈ మొత్తాన్ని జమ చేయాలని అధికారులను ఆదేశించారు.
News February 26, 2026
తిరుపతి: ఎగ్జాం సెంటర్ వద్దే హాల్ టికెట్లు

తిరుపతి SVU పరిధిలో డిగ్రీ మొదటి, రెండో, మూడో సంవత్సర ఇయర్ ప్యాటర్న్(వార్షిక విధానం) పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటి వరకు హాల్ టికెట్లు తీసుకోని వారు పరీక్ష సమయానికి ముందుగా ఉదయం 7గంటల నుంచి 9గంటల వరకు ఎగ్జాం సెంటర్ వద్దే పొందవచ్చని అధికారుల సూచించారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
News February 26, 2026
పాడి పశువులను అలా కట్టేసే ఉంచుతున్నారా?

చాలా మంది పాడి రైతులు పశువులను రోజంతా అలా కట్టేసి ఉంచుతారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు వెటర్నరీ నిపుణులు. దీని వల్ల వాటికి గాయాలు కావడంతో పాటు మానసిక ఒత్తిడికి గురవడంతో పాటు క్రమంగా దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు పెరుగుతుందని అంటున్నారు. వాటిని కచ్చితంగా ఉదయం, సాయంత్రం కాసేపు నడిపించాలని సలహా ఇస్తున్నారు. వాటి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, పశువులకు రోజూ స్నానం చేయించాలని సూచిస్తున్నారు.


