News July 22, 2024

ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతా: ఏయూ వీసీ

image

ఏయూ ఉద్యోగుల ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతానని ఇన్చార్జి వీసి ఆచార్య జి.శశిభూషణరావు అన్నారు. సోమవారం ఆయన ఆర్ట్స్ కళాశాల బోధన, బోధనేతర సిబ్బందితో సమావేశం అయ్యారు. ఫ్యాకల్టీకి ఏయూ ప్రతిష్ట ఆధారపడి ఉంటుందన్నారు. సమయపాలన పాటిస్తూ, నిబద్ధతతో సేవలు అందించాలని సూచించారు. ప్రతి విభాగాన్ని సందర్శిస్తానని అందరి సూచనలు స్వీకరిస్తానని తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్, ప్రిన్సిపల్ పాల్గొన్నారు.

Similar News

News November 17, 2025

ఒక్క ప్రాజెక్టు తెచ్చినట్టు నిరూపించినా రాజీనామా చేస్తా: గంటా

image

వైసీపీ హయాంలో మొదలు పెట్టి, పూర్తి చేసి ప్రారంభించిన ఒక్క ప్రాజెక్టు చూపించినా తన పదవికి రాజీనామా చేస్తానని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సవాల్ చేశారు. ఎంవీపీ కాలనీ క్యాంపు కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తన అయిదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కియా వంటి చెప్పుకోదగ్గ ఒక్క కంపెనీని కూడా రాష్ట్రానికి తీసుకురాలేకపోయిందని మండిపడ్డారు.

News November 17, 2025

ఒక్క ప్రాజెక్టు తెచ్చినట్టు నిరూపించినా రాజీనామా చేస్తా: గంటా

image

వైసీపీ హయాంలో మొదలు పెట్టి, పూర్తి చేసి ప్రారంభించిన ఒక్క ప్రాజెక్టు చూపించినా తన పదవికి రాజీనామా చేస్తానని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సవాల్ చేశారు. ఎంవీపీ కాలనీ క్యాంపు కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తన అయిదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కియా వంటి చెప్పుకోదగ్గ ఒక్క కంపెనీని కూడా రాష్ట్రానికి తీసుకురాలేకపోయిందని మండిపడ్డారు.

News November 17, 2025

ఆన్‌లైన్ మోసాలపై పోలీసుల సూచనలివే..

image

సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ పోలీసులు సూచించారు. తెలియని కాల్స్, ఇమెయిల్స్, మెసేజ్‌లను నమ్మవద్దని హెచ్చరించారు. బ్యాంకు సిబ్బంది ఎప్పుడూ OTP, PIN, CVV అడగరని తెలిపారు. అనుమానాస్పద లింకులు ఓపెన్ చేయొద్దన్నారు. TeamViewer, AnyDesk వంటి రిమోట్ యాప్‌లు ఇన్స్టాల్ చేయవద్దని సూచించారు. ఒక్క నిర్లక్ష్యంతో పెద్ద నష్టం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.