News April 10, 2025
ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతాం: చిత్తూరు కలెక్టర్

గంగాధర నెల్లూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్, రాష్ట్ర మాల కార్పొరేషన్ ఫైనాన్స్ కమిటీ సభ్యుడు డాక్టర్ యుగంధర్ పొన్న బుధవారం కలెక్టర్ సుమిత్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను తక్షణమే కొనసాగించాలని కోరారు. అడవుల్లో జీవిస్తున్న గిరిజన ప్రజలకు మౌలిక వసతులను కల్పించాలని యుగంధర్ డిమాండ్ చేశారు. త్వరలోనే వాటిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.
Similar News
News February 26, 2026
చిత్తూరులో ఆ అధికారులంతా ట్రాన్స్ఫర్

2018 గ్రూప్-1 బ్యాచ్ అధికారులను ప్రాధాన్యత పోస్టుల నుంచి తప్పించాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 26 మంది RDOలు, 25 మంది DSPలను బదిలీ చేస్తూ హెడ్ క్వార్టర్స్ జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. దీంతో చిత్తూరు జిల్లా కుప్పం, నగరి RDOలు శ్రీనివాసులు రాజు, భవాని శంకరి, నగరి DSP మహమ్మద్ అజీజ్, సాంఘిక సంక్షేమశాఖ DD విక్రమ్ కుమార్ రెడ్డి బదిలీ అయ్యారు
News February 26, 2026
చిత్తూరు: పంచాయతీ కార్యదర్శులకు ప్రమోషన్

పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్-5 నుంచి గ్రేడ్-4కు ప్రమోషన్ ఇచ్చారు. చిత్తూరు DPO సుధాకర్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ చేపట్టారు. జిల్లాలో 23 మందికి ప్రమోషన్ రాగా.. అన్నమయ్య జిల్లాలో పదోన్నతి పొంది అదనంగా ఉన్న 14 మందిని చిత్తూరు జిల్లాకు తీసుకున్నారు. తిరుపతి జిల్లాలో 10 మందికి ప్రమోషన్ ఇచ్చారు. పలు గ్రేడ్లలో ఉన్న 10 మందిని చిత్తూరు జిల్లాకు తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
News February 26, 2026
చిత్తూరు జిల్లాలో RDOల బదిలీ

కుప్పం RDO శ్రీనివాసరాజును బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 26 మంది రెవిన్యూ డివిజన్ ఆఫీసర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇందులో భాగంగా కుప్పం RDO శ్రీనివాసరాజు, నగరి RDO భవాని శంకర్ను ట్రాన్స్ఫర్ చేసింది. ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి వద్ద రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


