News January 4, 2025
ప్రత్తిపాడులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్డెడ్

ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంతోషి మాతా దేవాలయం వద్ద హైవేపై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో బైక్పై వెళ్తున్న వాహనదారుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 30, 2025
రాజమండ్రి: నేటి మాంసం ధరలు ఇలా!

వారాంతం కావడంతో మాంసాహార దుకాణాలు వినియోగదారులతో కళకళలాడుతున్నాయి. రాజమండ్రి మార్కెట్లో కిలో స్కిన్లెస్ చికెన్ ధర రూ. 250, స్కిన్తో రూ. 230గా ఉంది. లైవ్ కోడి ధర రూ.140 నుంచి రూ.150 వరకు లభిస్తోంది. ఇక, కేజీ మటన్ ధర రూ. 900కు విక్రయిస్తున్నారు. ప్రాంతాలవారీగా ధరలలో స్వల్ప తేడాలున్నాయి. మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News November 29, 2025
రాజమండ్రి: ‘సెలవుల్లోనూ.. విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు’

విద్యుత్ బిల్లులు వసూళ్ల కౌంటర్లు ఆదివారం కూడా పని చేస్తాయని APEPDCL సూపరింటెండింగ్ ఇంజినీర్ కె.తిలక్ కుమార్ తెలిపారు. రెవెన్యూ కార్యాలయాలతో పాటు APEPDCL సెక్షన్ ఆఫీస్ కలెక్షన్ కౌంటర్లు, A.T.P సెంటర్లలో కూడా బిల్లులు ఆదివారం చెల్లించవచ్చని తెలిపారు. జిల్లాలోని విద్యుత్ వినియోగదారులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు.
News November 29, 2025
రాజమండ్రి : ఈవీఎం గోడౌన్ పరిశీలించిన DRO

జిల్లా రెవెన్యూ అధికారి టి.సీతారామ మూర్తి శనివారం రాజమండ్రిలో ఈవీఎంల గోడౌన్ను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర,రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు చేపట్టే సాధారణ తనిఖీల్లో భాగంగా ఉదయం స్ట్రాంగ్ రూమ్ గోడౌన్ను సందర్శించినట్లు చెప్పారు. వివిధ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేసి, సంబంధిత రిజిస్టర్లలో సంతకాలు చేసినట్లు పేర్కొన్నారు. స్ట్రాంగ్ రూమ్ల్లో కెమెరాల పర్యవేక్షణ ఉందన్నారు.


