News January 31, 2025
ప్రత్తిపాడు: ఆవు దూడల పుట్టినరోజు.. ఊరంతా భోజనాలు

ప్రత్తిపాడు మండలం చిన్నశంకర్లపూడి గ్రామంలో గురువారం ఉదయం రామలక్ష్మణుల పుట్టినరోజు వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఇంతకీ ఈ రామలక్ష్మణులు ఎవరనుకుంటున్నారా? మిరియాల వెంకటేష్ అనే రైతుకి చెందిన ఆవు గతేడాది ఒకే కాన్పులో కవలగిత్తలకు జన్మనిచ్చింది. వాటికి రామలక్ష్మణులుగా నామకరణం చేసి అపురూపంగా చూసుకుంటున్నారు. ఇవాళ వాటి బర్త్ డే సందర్భంగా భారీ కేక్ కట్ చేసి ఊరంతా భోజనాలు ఏర్పాటు చేశారు.
Similar News
News October 30, 2025
సెంచరీ భాగస్వామ్యం.. ఉత్కంఠగా మ్యాచ్

WWCలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచులో టీమ్ఇండియా బ్యాటర్లు జెమీమా రోడ్రిగ్స్(81*), హర్మన్ ప్రీత్(66*) అర్ధసెంచరీలు చేశారు. 59 పరుగులకే ఓపెనర్లు ఔటవ్వగా వీరిద్దరు సెంచరీ భాగస్వామ్యంతో జట్టును పటిష్ఠ స్థితిలోకి చేర్చారు. ప్రస్తుతం భారత్ స్కోరు 198/2. విజయానికి ఇంకా 19 ఓవర్లలో 141 పరుగులు చేయాల్సి ఉంది. ఎలాగైనా ఈ మ్యాచులో భారత్ గెలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
News October 30, 2025
SKLM: పోలీస్ కుటుంబానికి రూ.కోటి అందజేత

శ్రీకాకుళం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న జగదీష్ కుటుంబానికి రూ.కోటిలను ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి గురువారం ఎస్పీ కార్యాలయంలో అందజేశారు. ఈ ఏడాది జూన్ నెలలో దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. పోలీస్ శాలరీ ప్యాకేజీ ద్వారా ఈ నష్టపరిహారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంజూరు చేసిందని SP పేర్కొన్నారు. ఖాతాలకు పోలీస్ శాలరీ ప్యాకేజ్ అనుసంధానం చేసుకోవాలన్నారు.
News October 30, 2025
రేపు వనపర్తిలో 2కే రన్: కలెక్టర్

సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతిని పురస్కరించుకుని 2కే రన్ నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు బాలుర జూనియర్ కళాశాల మైదానం నుంచి ప్రారంభమయ్యే ఈ పరుగు పాలిటెక్నిక్ కళాశాల వద్ద ముగుస్తుందని తెలిపారు. ఈ రన్ను విజయవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.


