News February 12, 2025
ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ..!

భువనగిరి ప్రత్యేక అధికారిగా శ్యాం సుందర్ను నియమిస్తూ కలెక్టర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో భాగంగా పంచాయతీరాజ్ శాఖకు చెందిన అధికారులు నాలుగు మండలాలకు ప్రత్యేక అధికారులుగా ఉన్నారు. కాగా వారిని రిలీవ్ చేశారు. గుండాలకి పద్మావతి, పోచంపల్లికి రమణి, రాజపేటకి శాంతి నిర్మలను ప్రత్యేక అధికారులగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News October 24, 2025
నాగార్జున యూనివర్సిటీ డిప్లొమా జర్నలిజం ఫలితాలు

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో ఆగష్టు 2025లో నిర్వహించిన డిప్లమో ఇన్ జర్నలిజం ఫలితాలను శుక్రవారం పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు విడుదల చేశారు. డిప్లమో ఇన్ జర్నలిజంలో 56% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. జవాబు పత్రాల రీవాల్యుయేషన్ కోసం నవంబర్ 4లోపు ఒక్కొక్క సబ్జెక్టుకు రూ.1,860, జవాబు పత్రం నకలు కావాలనుకునేవారు రూ. 2,190లు చెల్లించాలన్నారు.
News October 24, 2025
MDK: కర్నూలు బస్సు ప్రమాదంలో తల్లీకూతుళ్లు సజీవదహనం

HYD-బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్ కర్నూలు సమీపంలో అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే. అయితే ఈఘటనలో మెదక్(M)కు చెందిన తల్లీకూతుళ్లు సజీవ దహనమయ్యారు. మండలంలోని శివాయిపల్లికి చెందిన మంగ వేణు అలియాస్ ఆనంద్ దుబాయ్లో ఉంటున్నాడు. ఇటీవల స్వగ్రామానికి వచ్చి తిరిగెళ్లాడు. కుమార్తె మంగ చందన(23)ను బెంగళూరులో విడిచి దుబాయ్ వెళ్లేందుకు తల్లి సంధ్యారాణి(43) బస్సులో వెళ్తుండగా ప్రమాదంలో మరణించారు.
News October 24, 2025
BREAKING: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో 58 మంది

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శనివారంతో పూర్తయింది. మొత్తం 81 మంది అభ్యర్థుల నామినేషన్లు అధికారులు ఆమోదించగా. ఆఖరి రోజు 23 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో పోటీలో 58 మంది అభ్యర్థులు నిలిచారు. పెద్ద సంఖ్యలో అభ్యర్థుల ఉపసంహరణ ఉంటుందని ఊహించినప్పటికీ చాలామంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోలేదు. దీంతో ఒక్కో కేంద్రంలో నాలుగు ఈవీఎంలు ఉండే అవకాశం ఉంది.


