News January 28, 2025
ప్రత్యేక అలంకరణలో శంబర పోలమాంబ

ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ భక్తులకు ప్రత్యేక దర్శనం ఇవ్వనున్నారు. మంగళవారం మధ్యాహ్నం ప్రధాన జాతరలో భాగంగ సిరిమానోత్సం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పోలమాంబ అమ్మవారిని వనంగుడి, చదురుగుడి ఆలయాల్లో ప్రత్యేకంగా అలంకరించారు. రెండు ఆలయాలు పూలు, విద్యుత్ కాంతులతో కళకళలాడుతున్నాయి. వేకువజామునుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
Similar News
News January 11, 2026
కోనసీమ: ఓడలరేవు తీరంలో ప్రమాదం

అల్లవరం మండలం ఓడలరేవు తీరంలో కోత నివారణకు ONGC ఆధ్వర్యంలో నిర్మిస్తున్న రక్షణ కవచం పనుల్లో ప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద రాళ్లను అన్లోడ్ చేస్తున్న సమయంలో ఒక లారీ అదుపుతప్పి ఒక్కసారిగా తిరగబడింది. తీర ప్రాంతంలో పనులు వేగంగా జరుగుతున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 11, 2026
పిండి వంటల్లో బెల్లం వాడుతున్నారా?

సంక్రాంతి వచ్చిందంటే ఎక్కడ చూసినా పిండి వంటల ఘుమఘుమలే. అయితే తీపి వంటకాల్లో పంచదారకు బదులు బెల్లం వాడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. బెల్లంలో క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, భాస్వరం, జింక్, సెలీనియం, విటమిన్లు ఉన్నాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు, దంతాలు పటిష్టంగా ఉంటాయి. శరీరంలో చేరిన మలినాలను బయటకు పంపేస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది.
News January 11, 2026
WGL: ఆ మెసేజ్ నమ్మొద్దు.. అది ఆకతాయిల పనే!

జిల్లాలో ‘4 కిడ్నీలు సిద్ధంగా ఉన్నాయి’ అంటూ వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతున్న సందేశం పూర్తిగా అవాస్తవమని తేలింది. ఈ మెసేజ్పై అనుమానం వచ్చి అందులోని నంబర్ను సంప్రదించగా, అది ఒక యువతికి చెందినదిగా వెల్లడైంది. ఎవరో ఆకతాయిలు కావాలనే తన నంబర్తో ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీనివల్ల తాను తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని సదరు యువతి ఆవేదన వ్యక్తం చేశారు.


