News January 26, 2025

ప్రథమ బహుమతి సాధించిన gvmc శకటం 

image

76వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విశాఖపట్నం పోలీస్ గ్రౌండ్‌లో నిర్వహించిన వేడుకల్లో వివిధ శాఖల నుంచి 9 శకటాల ప్రదర్శన జరిగింది. ఈ శకటాల ప్రదర్శనలో ప్రథమ బహుమతి జీవీఎంసీ , ద్వితీయ బహుమతి డీ.ఆర్.డీ.ఏ, తృతీయ బహుమతి వీఎంఆర్డిఏ శకటాలు సాధించాయి. మిగతా విద్యా, సమగ్ర శిక్ష అభియాన్ శకటాలకు ప్రోత్సాహక బహుమతులను కలెక్టర్ అందజేశారు.

Similar News

News February 18, 2025

బ‌హుళ పంట‌ల విధానంపై రైతుల్లో చైత‌న్యం తీసుకురావాలి: కలెక్టర్

image

లాభ‌దాయ‌క సాగు విధానాల‌పై రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని వ్య‌వ‌సాయ అనుబంధ శాఖ‌ల‌ అధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ప్ర‌కృతి సేద్యానికి, మిల్లెట్లు, బ‌హుళ పంట‌ల సాగుకు ప్రాధాన్య‌త ఇవ్వాల‌న్నారు. గ్రామాలల్లో ప్ర‌తి ఇంటి వ‌ద్దా కంపోస్ట్ పిట్ ఏర్పాటు, కిచెన్ గార్డెన్ల పెంప‌కం చేసేలా అవ‌గాహ‌న కల్పించాలన్నారు.

News February 18, 2025

గాజువాక: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

గాజువాక షీలా నగర్ హైవేపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మైలపల్లి మనోహర్ బైక్‌ను నడుపుతుండగా ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతని తండ్రి పేరు దేముడు అని ఐడి కార్డులో రాసి ఉంది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 18, 2025

విశాఖలో చదివిన ఏయూ వైస్-చాన్సలర్‌ రాజశేఖర్

image

ఏయూ వైస్-చాన్సలర్‌‌గా మంగళవారం నియామకం అయిన రాజశేఖర్ విశాఖలో విద్యాభ్యాసం చేశారు. విశాఖలో సెయింట్ ఆంథోనీస్ హైస్కూల్‌లో పదోతరగతి పూర్తి చేశారు. ఏ.వి.ఎన్. కళాశాలలో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయనను ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా నియమించారు. అయితే విశాఖతో అనుబంధం ఉన్న వ్యక్తిని వైస్ ఛాన్సలర్‌గా నియమించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

error: Content is protected !!