News March 13, 2025

ప్రభలతో దద్దరిల్లనున్న కొమ్మాల!

image

హోలీ రోజు జరిగే గీసుగొండ కొమ్మాల జాతరకు తరలివచ్చే ఎడ్ల బండ్లు, రాజకీయ ప్రభలకు దశాబ్దాల చరిత్ర ఉంది. వేలాది భక్తులు ప్రభ బండ్లను ఊరేగింపుగా తీసుకొస్తారు. హోలీ రోజు, నిండు పౌర్ణమి సందర్భంగా భక్తులు, రాజయకీయ నాయకులు ఎడ్లబండ్లు, ఒంటె, ఏనుగు, గుర్రం, మేక వంటి ప్రభలతో ఇక్కడికి వస్తుంటారు. పోటీ పడి మరీ ప్రభలను ఎత్తులో నిర్మిస్తుంటారు. వరంగల్ నుంచి కూడా ఇక్కడకు ఎడ్లబండ్లపై వస్తుండటం విశేషం.

Similar News

News February 14, 2026

మిర్యాలగూడలో 11 మందికి ‘0’ ఓట్లు

image

MLG మున్సిపాలిటీ ఎన్నికల్లో వింత ఘటన చోటుచేసుకుంది. పోటీ చేసిన 51 మంది స్వతంత్ర అభ్యర్థుల్లో ఏకంగా 11 మందికి ‘సున్నా’ ఓట్లు వచ్చాయి. వీరికి కనీసం ఒక్కరి నుంచి కూడా మద్దతు లభించకపోవడం చర్చనీయాంశమైంది. మరో ఐదుగురు అభ్యర్థులు కేవలం ఒక్క ఓటుతోనే సరిపెట్టుకున్నారు. ఈ ఫలితాలు చూసి పట్టణ ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఓ వార్డుకు చెందిన వారు మరో వార్డులో పోటీలో ఉన్నట్లు సమాచారం.

News February 14, 2026

దుబాయిలో నందిపేట మండల యువకుడి మృతి

image

నందిపేట మండలం లక్కంపల్లికి చెందిన పస్క రాజు(27) దుబాయ్‌లో మరణించారు. స్థానికుల వివరాల ప్రకారం.. రాజు తండ్రి మరణించడంతో కుటుంబ భారాన్ని మోస్తూ పొట్టకూటి కోసం దుబాయ్‌ వెళ్లాడు. అక్కడ రాజు హఠాన్మరణం చెందారు. అతని మృతదేహాన్ని స్వగ్రామానికి వచ్చేలా ప్రభుత్వం ఆదుకోవాలని బంధువులు కోరుతున్నారు.

News February 14, 2026

దివ్యాంగులకు ఫ్రీ బస్సు.. బడ్జెట్‌లో ప్రస్తావన

image

AP: రాష్ట్ర బడ్జెట్‌లో దివ్యాంగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ‘ఇంద్రధనుస్సు’ పేరుతో అమలు చేయనున్నట్లు బడ్జెట్ ప్రతుల్లో పేర్కొంది. కాగా ప్రస్తుతం దివ్యాంగులు 50% టికెట్ సబ్సిడీతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. అయితే ఈ స్కీమ్ ఎప్పటి నుంచి అమలు చేస్తారో వెల్లడించలేదు.