News March 13, 2025

ప్రభలతో దద్దరిల్లనున్న కొమ్మాల!

image

హోలీ రోజు జరిగే గీసుగొండ కొమ్మాల జాతరకు తరలివచ్చే ఎడ్ల బండ్లు, రాజకీయ ప్రభలకు దశాబ్దాల చరిత్ర ఉంది. వేలాది భక్తులు ప్రభ బండ్లను ఊరేగింపుగా తీసుకొస్తారు. హోలీ రోజు, నిండు పౌర్ణమి సందర్భంగా భక్తులు, రాజయకీయ నాయకులు ఎడ్లబండ్లు, ఒంటె, ఏనుగు, గుర్రం, మేక వంటి ప్రభలతో ఇక్కడికి వస్తుంటారు. పోటీ పడి మరీ ప్రభలను ఎత్తులో నిర్మిస్తుంటారు. వరంగల్ నుంచి కూడా ఇక్కడకు ఎడ్లబండ్లపై వస్తుండటం విశేషం.

Similar News

News November 18, 2025

ఢిల్లీ పేలుడు: హమాస్ తరహా దాడికి ప్లాన్?

image

ఢిల్లీ పేలుడు ఘటనలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. కారు బ్లాస్ట్‌కు ముందు టెర్రరిస్టులు భారీ దాడికి కుట్ర చేసినట్లు NIA దర్యాప్తులో వెల్లడైంది. డ్రోన్లను ఆయుధాలుగా మార్చేందుకు, రాకెట్లను తయారు చేసేందుకు యత్నించారని తేలింది. 2023లో ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన దాడి తరహాలో అటాక్ చేయాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అరెస్టయిన ఉగ్ర అనుమానితుడు డానిష్ ద్వారా ఈ వివరాలు తెలిసినట్లు సమాచారం.

News November 18, 2025

ఢిల్లీ పేలుడు: హమాస్ తరహా దాడికి ప్లాన్?

image

ఢిల్లీ పేలుడు ఘటనలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. కారు బ్లాస్ట్‌కు ముందు టెర్రరిస్టులు భారీ దాడికి కుట్ర చేసినట్లు NIA దర్యాప్తులో వెల్లడైంది. డ్రోన్లను ఆయుధాలుగా మార్చేందుకు, రాకెట్లను తయారు చేసేందుకు యత్నించారని తేలింది. 2023లో ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన దాడి తరహాలో అటాక్ చేయాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అరెస్టయిన ఉగ్ర అనుమానితుడు డానిష్ ద్వారా ఈ వివరాలు తెలిసినట్లు సమాచారం.

News November 18, 2025

రెండు రోజులు జాగ్రత్త!

image

TG: రాబోయే రెండు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 4 నుంచి 5 డిగ్రీల మేర తక్కువగా నమోదవుతాయని చెప్పింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో చలిగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటికే చలి పెరిగిపోయింది. ఉదయం 9 గంటలైనా తీవ్రత తగ్గడం లేదు.