News March 13, 2025
ప్రభలతో దద్దరిల్లనున్న కొమ్మాల!

హోలీ రోజు జరిగే గీసుగొండ కొమ్మాల జాతరకు తరలివచ్చే ఎడ్ల బండ్లు, రాజకీయ ప్రభలకు దశాబ్దాల చరిత్ర ఉంది. వేలాది భక్తులు ప్రభ బండ్లను ఊరేగింపుగా తీసుకొస్తారు. హోలీ రోజు, నిండు పౌర్ణమి సందర్భంగా భక్తులు, రాజయకీయ నాయకులు ఎడ్లబండ్లు, ఒంటె, ఏనుగు, గుర్రం, మేక వంటి ప్రభలతో ఇక్కడికి వస్తుంటారు. పోటీ పడి మరీ ప్రభలను ఎత్తులో నిర్మిస్తుంటారు. వరంగల్ నుంచి కూడా ఇక్కడకు ఎడ్లబండ్లపై వస్తుండటం విశేషం.
Similar News
News December 5, 2025
కప్పు పట్టేస్తారా? పట్టు విడుస్తారా?

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోల్పోయిన IND 3 వన్డేల సిరీస్లో తొలి మ్యాచు గెలిచి ఊపు మీద కనిపించింది. దీంతో ఇంకొక్క మ్యాచ్ గెలిస్తే సిరీస్ మనదే అనుకున్నారంతా. కానీ బౌలింగ్ ఫెయిల్యూర్, చెత్త ఫీల్డింగ్తో రెండో వన్డేను చేజార్చుకుంది. దీంతో రేపు విశాఖలో జరిగే చివరి వన్డే కీలకంగా మారింది. మరి భారత ఆటగాళ్లు ఈ మ్యాచులో సమష్టిగా రాణించి, సిరీస్ పట్టేస్తారో లేక SAకు అప్పగిస్తారో చూడాలి.
News December 5, 2025
MEGA PTM 3.0 విజయవంతం: కలెక్టర్

ఎన్టీఆర్ జిల్లాలోని 914 పాఠశాలల్లో MEGA PTM 3.0 విజయవంతంగా ముగిసిందని కలెక్టర్ లక్ష్మిశ తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారని చెప్పారు. 67,271 తల్లిదండ్రులు, 5,098 ఉపాధ్యాయులు, 73,889 విద్యార్థులు, SMC సభ్యులు 11,204, పూర్వ విద్యార్థులు 1,073, ప్రజా ప్రతినిధులు 1,359, అధికారులు 1,065, ఇతరులు 11,613 మంది పాల్గొన్నారని తెలిపారు.
News December 5, 2025
ఎన్టీఆర్ జిల్లాలో తగ్గుతున్న రోడ్డు ప్రమాదాలు: కలెక్టర్

ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గుతున్నాయని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. 2024లో 1343 ప్రమాదాలు ఉండగా, 2025లో 918కి తగ్గాయని చెప్పారు. ప్రమాదాల్లో మూడొంతులు ద్విచక్ర వాహనాల వల్లే జరుగుతున్నాయని పేర్కొన్నారు. మద్యం తాగి నడిపితే కఠిన చర్యలు ఉంటాయని కమిషనర్ రాజశేఖర్ బాబు హెచ్చరించారు. బ్లాక్స్పాట్లపై చర్యలు వేగవంతం చేస్తామన్నారు.


