News February 2, 2025

ప్రభాకర్‌ను విచారిస్తున్న పోలీసులు (UPDATE)

image

గచ్చిబౌలిలోని పబ్‌లో పోలీసులపై బత్తుల ప్రభాకర్ కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. అయితే ప్రభాకర్ నుంచి 2 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బిహార్ నుంచి తుపాకులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రభాకర్‌ను సీసీఎస్, క్రైమ్, ఎస్ఓటీ బృందాలు విచారిస్తున్నాయి. ప్రభాకర్‌పై ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయన్న అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Similar News

News February 24, 2026

WGL: ఇంటర్ పరీక్షలు.. పేపర్ లీకైతే ఇట్టే తెలిసిపోతుంది..!

image

ఉమ్మడి WGLలో ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఈసారి ఆధునిక సాంకేతికతకు ప్రాధాన్యం ఇచ్చారు. విద్యార్థుల హాల్ టికెట్లపై ముద్రించిన QR కోడ్ ద్వారా ఎగ్జామ్ సెంటర్‌ను సులభంగా తెలుసుకునే అవకాశం కల్పించారు. ప్రశ్నాపత్రాలపై కూడా క్యూఆర్ కోడ్ ప్రింట్ చేయడంతో పేపర్ లీక్ ఘటనలు జరిగితే సదరు కేంద్రాన్ని వెంటనే గుర్తించవచ్చు. పరీక్షా కేంద్రాల్లో CCTV పర్యవేక్షణతో పాటు ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లు తనిఖీలు చేయనున్నాయి.

News February 24, 2026

KMR: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

image

కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం జంగంపల్లి శివారులో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజు (27) అనే యువకుడు మృతి చెందాడు. బైకుపై గ్రామానికి వస్తుండగా జాతీయ రహదారిపై అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొన్నాడని స్థానికులు తెలిపారు. తీవ్ర గాయాలైన రాజును ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

News February 24, 2026

DANGER: HYDలో విష జ్వరాలు!

image

HYDలో దోమలు చిత్రహింసలు పెడుతున్నాయి. మూసీ పరిసరాల్లో లేకున్నా దోమలు విపరీతంగా వ్యాపించాయి. వేలాది దోమలు గుంపులుగా దండయాత్ర చేస్తున్నాయి. ఉప్పల్, చిల్కానగర్‌లో విష జ్వరాలతో ఆస్పత్రుల పాలవుతున్నారు. కోరంటి, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో చేరినట్లుగా పలువురు తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. చిన్న పిల్లలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దోమల నివారణకు చర్యలు లేవని ఆరోపిస్తున్నారు.