News February 2, 2025
ప్రభాకర్ను విచారిస్తున్న పోలీసులు (UPDATE)

గచ్చిబౌలిలోని పబ్లో పోలీసులపై బత్తుల ప్రభాకర్ కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. అయితే ప్రభాకర్ నుంచి 2 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీహార్ నుంచి తుపాకులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రభాకర్ను సీసీఎస్, క్రైమ్, ఎస్ఓటీ బృందాలు విచారిస్తున్నాయి. ప్రభాకర్పై ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయన్న అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Similar News
News January 7, 2026
21 లక్షల నుంచి 1.3 కోట్లకు చేరిన HYD జనాభా..!

దేశంలో 2050 నాటికి నగర జనాభా 50 కోట్లకు చేరనుందని లెక్కలు చెబుతున్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. 1975లో హైదరాబాద్ జనాభా 21 లక్షలుండంగా.. ప్రస్తుతం 1.3 కోట్లకు చేరింది. హైదరాబాద్లో జనాభా వృద్ధి రేటు 6.2 రెట్లుందని పేర్కొన్నారు. మేధో మదన సదస్సులో హైడ్రా కమిషనర్ రంగనాథ్ విస్తృతంగా ప్రసంగించారు.
News January 7, 2026
రూ.65,650 కోట్ల విలువైన భూములు కాపాడిన హైడ్రా

HYDలో ఆక్రమణలపై HYDRAA చర్యలు కొనసాగిస్తోంది. తాజాగా జరిగిన ఎల్బీఎస్ఎన్ఏలో హైడ్రా కమిషనర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. చెరువులు, పార్కులు, రోడ్లు, నాలాలు కలిపి 1,313.19 ఎకరాల ప్రభుత్వ భూములను HYDRAA స్వాధీనం చేసుకుంది. వీటి విలువ రూ. 65,650 కోట్లుగా అంచనా. మూసీ పరీవాహక ప్రాంతంలోని ఆక్రమణలు తొలగించి, సహజ ప్రవాహం పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
News January 6, 2026
HYD ఈస్ట్ రెసిడెన్స్కు గుడ్ న్యూస్!

HYD ఈస్ట్ ప్రాంత వాసుల సీవరేజ్ వాటర్ కష్టాలకు చెక్ పడనుంది. నాగోల్లోని 320 MLD ప్లాంట్ ఆధునీకరణకు జలమండలి రూ.3.83 కోట్ల భారీ బడ్జెట్తో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జల్ హీ అమృత్ పథకంలో భాగంగా ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. అత్యాధునిక యంత్రాలతో ట్రంక్ సీవర్ల పూడికతీత, నాలాల రక్షణ గోడల మరమ్మతులు చేపట్టనున్నారు. దీంతో మురుగు వాసన తగ్గడమే కాకుండా, శుద్ధి చేసిన నీటిని రీసైక్లింగ్ చేసి వాడుకునే వీలుంటుంది.


