News February 5, 2025

ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలను పెంచాలి: SRPT కలెక్టర్

image

అధికారులు విధుల్లో పారదర్శకంగా పనిచేసి గుర్తింపు పొందాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మంగళవారం ఆత్మకూరు(ఎస్) మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అధిక ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు, వైద్యులు పాల్గొన్నారు.

Similar News

News November 24, 2025

దీపాల కింద కూర్చుని చదువుకున్నా: CJI

image

ఓ చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన తాను <<18373221>>CJI<<>> అవుతానని ఎప్పుడూ అనుకోలేదని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. అప్పట్లో న్యాయవ్యవస్థ అంటే ఏంటో కూడా తెలియదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘మా ఊరికి విద్యుత్ సరఫరా సరిగ్గా ఉండేది కాదు. దీపాల కింద కూర్చుని చదువుకున్నా. లాయర్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పుడు సీనియర్లు ఎంతో సాయం చేశారు. హైకోర్టుకెళ్లాక 5-6 ఏళ్లలోనే విజయవంతమైన లాయర్‌గా పేరు తెచ్చుకున్నా’ అని చెప్పారు.

News November 24, 2025

నిజామాబాద్: కాంగ్రెస్, BRSపై అర్బన్ ఎమ్మెల్యే ఫైర్!

image

కాంగ్రెస్, BRSపై నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ శాసనసభ్యుడు ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా ఫైర్ అయ్యారు. రైతులను గాలికి వదిలేయడంలో BRS, కాంగ్రెస్ రెండు పార్టీలు దొందూ దొందే అని విమర్శించారు. రైతులకు ఎరువులు అందించడంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరూ విఫలమయ్యారని ట్వీట్ చేశారు.

News November 24, 2025

సింగూరు డ్యామ్‌లో 1 నుంచి ‘ఖాళీ’ పనులు

image

మహానగరానికి తాగునీరు అందించే సింగూరు జలాశయం మరమ్మతులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాలంటే ముందుగా జలాశయంలో నీటిమట్టం తగ్గించాలి. అందుకే వచ్చేనెల ఒకటో తేదీ నుంచి రోజుకు 30 సెంటీమీటర్లు నీటిని తోడేయాలని నీటిపారుదల శాఖ అధికారులు నిర్ణయించారు. నీటిమట్టాన్ని 517.8 మీటర్లకు తెచ్చి (ప్రస్తుత నీటిమట్టం 520.49 మీ.) ఆ తర్వాత పనులు ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం.