News February 5, 2025

ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలను పెంచాలి: SRPT కలెక్టర్

image

అధికారులు విధుల్లో పారదర్శకంగా పనిచేసి గుర్తింపు పొందాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మంగళవారం ఆత్మకూరు(ఎస్) మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అధిక ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు, వైద్యులు పాల్గొన్నారు.

Similar News

News November 26, 2025

KNR: ఆయిల్ పామ్ తోటలపై రైతులకు అవగాహన సదస్సు

image

కలెక్టరేట్ ఆడిటోరియంలో సహకార, ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ తోటల పెంపకంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాఖడే ముఖ్య అతిథిగా హాజరై, ఆయిల్ పామ్ సాగు ద్వారా రైతులకు దీర్ఘకాలిక ఆర్థిక లాభాలు లభిస్తాయని సూచించారు. రైతులు ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News November 26, 2025

27న దివ్యాంగులకు క్రీడా పోటీలు: డీఎస్డీఓ

image

దివ్యాంగుల్లో క్రీడా చైతన్యం నింపేందుకు ఈ నెల 27న డీఎన్‌ఆర్‌ క్రీడా మైదానంలో ‘అవేర్‌నెస్‌ వాక్‌ ఫర్‌ స్పోర్ట్స్‌’ నిర్వహిస్తున్నామని డీఎస్డీఓ ఎన్‌.మోహన్ దాస్ మంగళవారం తెలిపారు. బ్యాడ్మింటన్ (సింగిల్స్, డబుల్స్), క్రికెట్, 100 మీటర్ల పరుగు, షాట్‌ఫుట్‌ పోటీలు ఉంటాయన్నారు. పోటీలకు వచ్చే వికలాంగులు ఆధార్, వికలాంగుల గుర్తింపు కార్డులను తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు.

News November 26, 2025

రాష్ట్ర పండుగగా ‘జగ్గన్నతోట ప్రభల తీర్థం’

image

AP: అంబేడ్కర్ కోనసీమ (D) మొసలపల్లిలో ఏటా సంక్రాంతికి నిర్వహించే “జగ్గన్నతోట ప్రభల తీర్థం”ను రాష్ట్ర పండుగగా గుర్తించేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారని మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. 450 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రభల ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించాలని పవన్ కళ్యాణ్, తాను గతంలో సీఎం దృష్టికి తీసుకెళ్లామని గుర్తుచేశారు. ఎన్నో తరాల నుంచి ఇది సంప్రదాయంగా వస్తోందన్నారు.