News February 5, 2025
ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలను పెంచాలి: SRPT కలెక్టర్

అధికారులు విధుల్లో పారదర్శకంగా పనిచేసి గుర్తింపు పొందాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మంగళవారం ఆత్మకూరు(ఎస్) మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అధిక ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు, వైద్యులు పాల్గొన్నారు.
Similar News
News October 19, 2025
చిత్తూరు తాలూకా SI సస్పెండ్

చిత్తూరు తాలూకా ఎస్ఐ మల్లికార్జున సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు SP తుషార్ డూడీ ఆదేశాలు జారీ చేశారు. మల్లికార్జునపై పలు ఆరోపణలు రావడంతో క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఓ బాధితుడు SI ఆడియో రికార్డును కలెక్టర్, ఎస్పీకి పంపినట్లు తెలుస్తోంది. ఘటనపై విచారణ జరిపిన ఎస్పీ చర్యలు తీసుకున్నారు.
News October 19, 2025
ఎమ్మెల్యే నెలవల విజయశ్రీతో పొన్నూరు ఎమ్మెల్యే భేటీ

సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ నాయుడుపేట పట్టణంలోని ఆమె నివాసంలో గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే, సంగం మిల్క్ డైరీ చైర్మన్ దూళిపాళ్ల నరేంద్ర శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. సంగం డైరీ మేనకూరు సెజ్ పరిసర ప్రాంతంలో ఏర్పాటు అవుతుండగా ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన విషయాలపై ఇరువురు ఎమ్మెల్యేలు చర్చించుకున్నారు. సంగం డైరీ రైతులకు, పాల ఉత్పత్తిదారులకు ఆశాకిరణమని ధూళిపాల నరేంద్ర తెలిపారు.
News October 19, 2025
నెల్లూరు జనసేన వివాదంపై త్వరలో విచారణ!

నెల్లూరు జిల్లా జనసేన పార్టీలో ఇటీవల ఏర్పడిన వివాదాలపై పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్గా దృష్టి సారించారు. జిల్లా ముఖ్య నేత, టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ్పై కొందరు నాయకులు బహిరంగంగానే విమర్శలు చేశారు. పార్టీ సీనియర్ నాయకులను కాదని వైసీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని అధినేత దృష్టికి తీసుకెళ్లారు. దాంతో పార్టీ రాష్ట్ర MSME ఛైర్మన్ శివశంకర్ను విచారణకు పంపనున్నారు.