News August 28, 2024
ప్రభుత్వ ఉద్యోగి మృతి.. 4 రోజుల తర్వాత గుర్తింపు

NLG వైద్యఆరోగ్యశాఖ పరిధిలో పనిచేస్తున్న హెల్త్ అసిస్టెంట్ పురుషోత్తం రాజు(48) అనారోగ్యంతో 4 రోజుల క్రితం మృతి చెందారు. ఇటీవల పురుషోత్తమ రాజు సడెన్గా విధులకు హాజరు కాకపోవడం, అందుబాటులో లేకపోవడంతో మంగళవారం తోటి ఉద్యోగులు పానగల్ అలివేలుమంగాపురం కాలనీలో ఉన్న అతడి ఇంటికి వెళ్లి చూసి పోలీసులు సమాచారం ఇచ్చారు. తలుపులు పగలగొట్టి చూడడంతో అతడి మృతదేహం కుళ్ళిపోయి కనిపించింది.
Similar News
News October 27, 2025
నల్గొండ: మహిళలకు గుడ్ న్యూస్

నల్గొండ శివారు రాంనగర్లోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో గ్రామీణ నిరుద్యోగ స్త్రీలకు టైలరింగ్లో 31 రోజుల ఉచిత శిక్షణ ఇస్తున్నామని సంస్థ డైరెక్టర్ రఘుపతి తెలిపారు. శిక్షణలో ఉచిత టూల్ కిట్, భోజనం వసతి, షెల్టర్ ఇస్తామన్నారు. 18 సం. నుంచి 45 లోపు ఉమ్మడి నల్గొండకు చెందిన వారు అర్హులన్నారు. ఆసక్తి గల వారు అక్టోబర్ 29 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News October 27, 2025
NLG: జిల్లాలో మొంథా అలజడి

జిల్లాలో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా మొంథా తుపాను ముంచుకొస్తుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కురిసిన వర్షాలు, ఈదురు గాలులు కారణంగా వందల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. శాలిగౌరారం మండలంలో ఏకంగా రోడ్డు తెలిపోయింది.
News October 27, 2025
NLG: ఆగ మేఘాలతో ఆధార్ అనుసంధానం..!

జిల్లాలో ఔట్సోర్సింగ్ ఏజెన్సీల అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణకు దిగింది. ఔట్సోర్సింగ్ ద్వారా విధుల్లో చేరిన ఉద్యోగుల వివరాలను ఆధార్ అనుసంధానిస్తున్నారు. దీని ద్వారా క్షేత్రస్థాయిలో పనిచేయకుండానే.. రికార్డుల్లో చూపే వారికి అందే వేతనాలు నిలిచిపోనున్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు రెండువేల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం.


