News September 21, 2024
ప్రభుత్వ తీరు హాస్యాస్పదంగా ఉంది: ఉషశ్రీ చరణ్

100 రోజుల పాలన విఫలం కావడంతోనే సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూల విషయం తెరపైకి తెచ్చి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని వైసీపీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ తెలిపారు. శనివారం పెనుకొండలో ఆమె మాట్లాడుతూ.. కూటమి మంచి ప్రభుత్వమా? కాదా అన్నది? ప్రజలు చెప్పాలన్నారు. కానీ కూటమి నేతలే తమది మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.
Similar News
News January 5, 2026
ఈ నెల 6, 7వ తేదీలలో ఇంటర్వ్యూలు

17 పారామెడికల్ కళాశాలల్లో 2025-26 అకాడమిక్ ఇయర్కు సంబంధించి GNM కోర్సులో అడ్మిషన్స్ కోసం గతంలోనే నోటిఫికేషన్ విడుదల చేసినట్లు DMHO దేవి తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 761 మంది విద్యార్థినులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. కన్వీనర్ కోటాలో 594 సీట్లకు మెరిట్ కమ్ రిజర్వేషన్ ప్రాతిపదికన ఈనెల 6, 7వ తేదీలలో DMHO కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి కౌన్సిలింగ్ నిర్వహించి భర్తీ చేస్తామని DMHO తెలిపారు.
News January 4, 2026
అనంతపురం జిల్లా కాంగ్రెస్ బాస్ ఈయనే..!

అనంతపురం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరోసారి వై. మధుసూదన్ రెడ్డికే అధిష్టానం అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తనపై మరోసారి నమ్మకం ఉంచిన పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తానని పేర్కొన్నారు. ఈ నియామకంపై ఉరవకొండ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.
News January 4, 2026
అనంతపురం జిల్లా కాంగ్రెస్ బాస్ ఈయనే..!

అనంతపురం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరోసారి వై. మధుసూదన్ రెడ్డికే అధిష్టానం అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తనపై మరోసారి నమ్మకం ఉంచిన పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తానని పేర్కొన్నారు. ఈ నియామకంపై ఉరవకొండ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.


