News March 8, 2025
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు :జిల్లా కలెక్టర్

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే తెలిపారు. శుక్రవారం PM శ్రీ పథకంలో ఎంపికైన వాంకిడి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో పాఠశాల అదనపు తరగతుల నిర్మాణ స్థలాన్ని జిల్లా అదనపు కలెక్టర్తో కలిసి పరిశీలించారు. వాంకిడి కస్తూరిబా విద్యాలయంలో రూ.3 కోట్ల 25 లక్షల అంచనా వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి చర్యలు చేపట్టామన్నారు.
Similar News
News November 19, 2025
మావోయిస్టు నేత కొయ్యడ సాంబయ్య ఎక్కడ..!?

మావోయిస్టు అగ్ర నేత హిడ్మా ఎన్కౌంటర్, చీఫ్ తిప్పిరి తిరుపతి అంగరక్షకుల అరెస్ట్ నేపథ్యంలో ములుగు(D) చెందిన కొయ్యడ సాంబయ్య @ఆజాద్ ఎక్కడ..? అనే ప్రశ్న వినిపిస్తోంది. ఈనెల 14న ఆయనతో పాటు గోదావరిఖనికి చెందిన సికాస ఆర్గనైజర్ అశోక్ లొంగిపోయే క్రమంలో పోలీసులకు పట్టుబడ్డట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటివరకు పోలీసు వర్గాలు వారి అరెస్ట్ /లొంగుబాటును నిర్ధారించలేదు. దీంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
News November 19, 2025
నవంబర్ 19: చరిత్రలో ఈ రోజు

*1828: స్వాతంత్య్ర పోరాట యోధురాలు ఝాన్సీ లక్ష్మీబాయి జననం
*1917: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జననం
*1960: సినీ నటుడు శుభలేఖ సుధాకర్ జననం
*1975: మాజీ విశ్వ సుందరి, నటి సుస్మితా సేన్ జననం
*అంతర్జాతీయ పురుషుల దినోత్సవం
*ప్రపంచ టాయిలెట్ దినోత్సవం
News November 19, 2025
KNR: స్థానిక సమరం షురు.. వచ్చే నెలలో ఎన్నికలకు క్యాబినెట్ పచ్చజెండా

బీసీ రిజర్వేషన్లపై ప్రతిష్ఠంభన సోమవారంతో వీడగా, ఇక పల్లెల్లో స్థానిక సమరం షురూ కానుంది. డిసెంబర్ నెలలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు సోమవారం జరిగిన క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కేవలం పార్టీపరంగా బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించడానికి నిర్ణయించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,216 గ్రామ పంచాయతీలు, 60 జడ్పీటీసీ, 646 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి.


