News March 8, 2025
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు :జిల్లా కలెక్టర్

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే తెలిపారు. శుక్రవారం PM శ్రీ పథకంలో ఎంపికైన వాంకిడి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో పాఠశాల అదనపు తరగతుల నిర్మాణ స్థలాన్ని జిల్లా అదనపు కలెక్టర్తో కలిసి పరిశీలించారు. వాంకిడి కస్తూరిబా విద్యాలయంలో రూ.3 కోట్ల 25 లక్షల అంచనా వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి చర్యలు చేపట్టామన్నారు.
Similar News
News November 22, 2025
APR 1 నుంచి యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్: సీఎం

AP: క్యాబినెట్ ఆమోదం తెలిపిన యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ విధానాన్ని 2026 APR 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని CM చంద్రబాబు ఆదేశించారు. ప్రస్తుతం NTR వైద్య సేవ ద్వారా ఏ ప్రాంతంలో, ఏ వ్యాధికి ఎంత ఖర్చు చేస్తున్నామో విశ్లేషించాలని సూచించారు. కాగా కొత్త పథకంతో 1.63 కోట్ల కుటుంబాలకు రూ.2.5 లక్షల వరకు నగదు రహిత వైద్యం, అందులో 1.43 కోట్ల BPL కుటుంబాలకు ఏడాదికి రూ.25 లక్షల ఉచిత వైద్యం అందుతుంది.
News November 22, 2025
వనపర్తి: భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య మృతి

భర్త మృతిని తట్టుకోలేక భార్య మృతి చెందిన ఘటన వీపనగండ్ల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వీపనగండ్లకు చెందిన మౌలాలి 15 రోజుల క్రితం మరణించాడు. మౌలాలి భార్య అలివేల (50) భర్త మరణంతో కుంగిపోయి తీవ్ర మానసిక ఆవేదనకు గురైంది. రోజురోజుకు ఆమె ఆరోగ్యం క్షీణించడంతో శుక్రవారం ఉదయం మరణించింది. దీంతో స్థానికంగా విషాదం అలుముకుంది.
News November 22, 2025
కడప జిల్లాలో ఇద్దరు సూసైడ్

పులివెందుల(M) నల్లపురెడ్డి పల్లె చెందిన నగేశ్(39) అనే కూలి శుక్రవారం ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మద్యానికి బానిసై, కూలి పనులు లేక పలువురు వద్ద అప్పులు చేశాడు. అవి తీర్చే మార్గంలేక మనస్తాపం చెంది సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కొండాపురంలోని ఓబన్నపేట చెందిన పొట్టి ఓబుల్ రెడ్డి(70) అనే వ్యక్తి కడుపునొప్పి భరించలేక శుక్రవారం ఉరి వేసుకున్నాడు.


