News March 8, 2025
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు :జిల్లా కలెక్టర్

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే తెలిపారు. శుక్రవారం PM శ్రీ పథకంలో ఎంపికైన వాంకిడి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో పాఠశాల అదనపు తరగతుల నిర్మాణ స్థలాన్ని జిల్లా అదనపు కలెక్టర్తో కలిసి పరిశీలించారు. వాంకిడి కస్తూరిబా విద్యాలయంలో రూ.3 కోట్ల 25 లక్షల అంచనా వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి చర్యలు చేపట్టామన్నారు.
Similar News
News October 24, 2025
MBNR: కురుమూర్తి జాతర స్పెషల్ బస్సుల వివరాలిలా.!

కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉమ్మడి MBNR జిల్లాలోని పలు డిపోల నుంచి ఈనెల 27, 28, 29న జాతరకు వెళ్లే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నారు. బస్సుల వివరాలు.. కొల్లాపూర్ డిపో నుంచి-32, MBNR-80, వనపర్తి -65, NGKL-65, NRPT-28 మొత్తం 270 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ఈ బస్సులు MBNR, WNP, NGKL, కొత్తకోట, పెబ్బేరు, దేవరకద్ర, ఆత్మకూర్ మొదలగు ప్రదేశాల నుంచి నడుపుతామని అధికారులు తెలిపారు.
News October 24, 2025
ADB: నేటి నుంచి పత్తి విక్రయానికి స్లాట్ బుకింగ్స్ ప్రారంభం

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 4 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేయగా.. ప్రభుత్వం రూ.8,110 మద్దతు ధర ప్రకటించింది. ఈనెల 27 నుంచి సీసీఐ అధికారులు పత్తి కొనుగోలు ప్రారంభించనుండగా ఈ రోజు(24వ తేదీ) నుంచి రైతులు తమ పంట విక్రయించేందుకు కిసాన్ కపాస్ యాప్లో స్లాట్ బుక్ చేసుకోవచ్చు. నిబంధనల ప్రకారం తేమ శాతం 8 నుంచి 12లోపు ఉంటేనే పత్తి కొనుగోలు చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు.
News October 24, 2025
జనగామ: మద్యం టెండర్లకు 1695 దరఖాస్తులు

మద్యం టెండర్ల దరఖాస్తు గురువారం అర్థరాత్రి ముగిసింది. జనగామ జిల్లాలోని 50 మద్యం దుకాణాలకు మొత్తం 1695 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. గురువారం ఒక్కరోజే 91 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. అత్యధికంగా చిన్నపెండ్యాల మద్యం దుకాణానికి 108 దరఖాస్తులు రావడం గమనార్హం. ఈనెల 27న లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయనున్నారు.


