News September 21, 2024

ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యత తహశీల్దార్లదే: సంగారెడ్డి కలెక్టర్

image

ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యత తహశీల్దార్లదేనని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ధరణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని చెప్పారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఆర్డీవోలు పాల్గొన్నారు.

Similar News

News October 21, 2025

MDK: మంజీరా నదిలో ఒకరి మృతి.. మరొకరి గల్లంతు

image

మెదక్ మండలం పేరూరు శివారులో మంజీరా వాగులో పడి బాలుడు మృతి చెందగా, రక్షించేందుకు దిగిన మరో వ్యక్తి గల్లంతయ్యాడు. గ్రామస్థుల వివరాలు.. పేరూరు గ్రామానికి చెందిన చింతకింది అంజమ్మ నిన్న మృతి చెందింది. ఈరోజు సాయంత్రం అంత్యక్రియల అనంతరం మంజీరాలో స్నానం చేసేందుకు దిగగా కృష్ణ (16) కాలుజారి పడిపోయాడు. కృష్ణ రక్షించేందుకు బీరయ్య వాగులో దిగి గల్లంతయ్యాడు. కృష్ణ మృతదేహం లభ్యం కాగా, బీరయ్య కోసం గాలిస్తున్నారు.

News October 21, 2025

మెదక్: 8 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకుడు

image

పాపన్నపేట మండలం పొడ్చన్ పల్లి గ్రామానికి చెందిన అరక అజయ్ కుమార్ 8 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు.
అరక జ్యోతి, సంజీవరావు కుమారుడు అజయ్ కుమార్ 2018లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, పంచాయతి కార్యదర్శిగా విధుల్లో చేరాడు. తర్వాత సౌత్ సెంట్రల్ రైల్వే లోకో పైలట్, ఆర్ఎస్ఐ, కానిస్టేబుల్, 2023లో ఎస్ఐ, గ్రూప్-2లో ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగం సాధించాడు.

News October 20, 2025

మెదక్: అగ్నిమాపక కేంద్రంలో కలెక్టర్ తనిఖీ

image

మెదక్ జిల్లా రామాయంపేటలోని అగ్నిమాపక కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. అగ్నిమాపక సేవలపై హర్షం వ్యక్తం చేసిన కలెక్టర్, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. కేంద్రంలోని పరికరాల పనితీరు, వాహనాల వినియోగం, హాజరు పట్టికను ఆయన పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు సిబ్బంది వెంటనే స్పందించాలని కలెక్టర్ ఆదేశించారు.