News March 18, 2025
ప్రభుత్వ స్థలాలను గుర్తించండి: నంద్యాల కలెక్టర్

నంద్యాల జిల్లాలో అభివృద్ధి సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని కలెక్టర్ జి.రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో వివిధ అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. విద్యుత్ సబ్ స్టేషన్లకు 5 నుంచి 10 ఎకరాలు, ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు 50 నుంచి 100 ఎకరాలను గుర్తించాలని సూచించారు.
Similar News
News November 28, 2025
SRCL: మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు ఇన్ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం మొదటి విడత ర్యాండమైజెషన్ ప్రక్రియను ఇన్ఛార్జ్ కలెక్టర్ నేతృత్వంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారులు పాల్గొన్నారు.
News November 28, 2025
అదనపు డబ్బులు వసూలు చేస్తే చర్యలు: JC

కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ లేని పేదలకు గ్యాస్ కనెక్షన్, మొదటి గ్యాస్ సిలిండర్ను సైతం ఉచితంగా అందజేయడం జరుగుతుందని JC గోపాలకృష్ణ అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం దీపం కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో మాట్లాడుతూ.. గ్యాస్ డెలివరీ చేసే సమయంలో అదనపు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, బాధ్యులైనవారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
News November 28, 2025
జగిత్యాల: వయోవృద్ధుల కోసం జెరియాట్రిక్ సేవలు ప్రారంభం

వృద్ధులు ప్రభుత్వం అందిస్తున్న జెరియాట్రిక్ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని JGTL జిల్లా సంక్షేమాధికారి డాక్టర్ నరేష్ సూచించారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన జెరియాట్రిక్ ఉచిత వైద్య సేవలను ఆయన ప్రారంభించారు. ఈ విభాగంలో పూర్తి ఆరోగ్య పరీక్షలు, కౌన్సెలింగ్, డయాబెటిస్, రక్తపోటు, గుండె, మూత్రపిండాలు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులపై చికిత్సతో పాటు ఫిజియోథెరపీ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.


