News August 18, 2024
ప్రమాదకరంగా కుందర వాగు వంతెన

కోవెలకుంట్ల మండలంలోని భీమునిపాడు సమీపాన కోవెలకుంట్ల-ఆళ్లగడ్డ R&B రహదారిలో కుందర వాగుపై ఏర్పాటుచేసిన వంతెన ప్రమాదకరంగా ఉంది. 1932 బ్రిటిష్ కాలంలో ఈ వంతెన నిర్మించారు. 92 ఏళ్లు కావడంతో వంతెన పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. వంతెనకు ఇరువైపులా ఏర్పాటుచేసిన కడ్డీలు వంగిపోవడంతో పాటు దిమ్మెలు పూర్తిగా దెబ్బతిని కూలేందుకు సిద్ధంగా ఉంది.
Similar News
News October 18, 2025
ఆడపిల్లలకు చదువుకునే హక్కు ప్రతి ఒక్కరూ ఇవ్వాలి: కలెక్టర్

ఆడపిల్లలందరికీ చదువుకునే హక్కు తప్పకుండా ఇవ్వాలని, వారికి పౌష్టికాహారం అందించి, సమాజంలో లింగ వివక్ష లేకుండా చూడాలని ఇవాళ కలెక్టర్ సిరి అంతర్జాతీయ బాలికా దినోత్సవంలో అన్నారు. జిల్లాలో కేవలం 56 శాతం ఉన్న అక్షరాస్యత రేటును 100 శాతంకి పెంచాలని కోరారు. విద్యార్థులు బాగా చదువుకుని జీవితంలో రాణించాలని, విద్యకు ప్రభుత్వం ఉచిత సౌకర్యాలు అందిస్తోందని, బాలికల రక్షణకు ‘స్త్రీ శక్తి’ యాప్ ఉందని పేర్కొన్నారు.
News October 18, 2025
జిల్లాలో ప్రధాని పర్యటన విజయవంతం: కలెక్టర్

జిల్లాలో ప్రధానమంత్రి పర్యటన విజయవంతంగా నిర్వహించినందుకు అధికారులు, సిబ్బందిని కలెక్టర్ డా. సిరి అభినందించారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అందరూ సమన్వయంతో పనిచేశారని ప్రశంసించారు. పర్యటనలో సీపీవో, ఆర్ అండ్ బీ, ఆర్టీసీ, డీఆర్వో, పారిశుద్ధ్య, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు తదితర అధికారులు సమర్థవంతగా వ్యవహరించారని తెలిపారు. పర్యటనలో ఒక అబ్బాయి మరణించడం దురదృష్టకరమని అన్నారు.
News October 18, 2025
ప్రధాని పర్యటనతో సీమకు ఒరిగిందేంటి?: ఎస్వీ మోహన్ రెడ్డి

ప్రధాని మోదీ కర్నూలు, శ్రీశైలం పర్యటనకు రూ.300 కోట్లు ఖర్చు చేసిన సీఎం చంద్రబాబు, రాయలసీమకు ఒక్క ప్రాజెక్టు కూడా మంజూరు చేయించుకోలేదని జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి విమర్శించారు. శనివారం కర్నూలులో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని పర్యటనతో సీమకు ఒరిగిందేమీ లేదని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు కర్నూలుకు మంజూరైన హైకోర్టు, లా యూనివర్సిటీని అమరావతికి తరలించడం దుర్మార్గమని మండిపడ్డారు.