News November 6, 2024

ప్రమాదాల నివారణకు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి

image

పరిశ్రమలలో ప్రమాదాల నివారణకు యాజమాన్యం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని ఎస్ ఆర్ శంకరన్ హాల్లో పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు ముందు జాగ్రత్త చర్యలపై జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమలలో ప్రమాదం జరిగితే సంబంధిత తహశీల్దార్, ఆర్డీవోకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందన్నారు.

Similar News

News February 23, 2026

ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు.. 888 మంది గైర్హాజరు: ఆర్ఐవో

image

నెల్లూరు జిల్లాలో మొదటి రోజు ఇంటర్ పరీక్ష‌ ఎక్కడ మాల్ ప్రాక్టీస్‌కు తావు లేకుండా ప్రశాంతంగా ముగిసినట్లు ఆర్‌ఐవో వరప్రసాదరావు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా 81 కేంద్రాలలో 27,613 మంది విద్యార్థులకు గాను 888 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరు అయినట్లు తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులకు కలగకుండా పరీక్షా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు, అన్ని మౌలిక వసతులు కల్పించామన్నారు.

News February 23, 2026

నెల్లూరు: పరిశ్రమకు భూమి కేటాయింపు

image

ఉదయగిరి మండలం చెర్లోపల్లి–వడ్డీపాలెం గ్రామాల సమీపంలో బయోగ్యాస్(CBG) ప్లాంట్ ఏర్పాటుకు భూమి కేటాయిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సర్వే నం.251లో సుమారు 200 ఎకరాల భూమిని ప్లాంట్ కోసం కేటాయించినట్లు పేర్కొన్నారు. జనావాసాల దగ్గర ప్లాంట్ ఏర్పాటుతో దుర్వాసన, కాలుష్యం, ప్రమాదాల భయం పెరుగుతుందని గ్రామస్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

News February 23, 2026

NLR: ఇంటర్ పరీక్షలను తనిఖీ చేసిన కలెక్టర్

image

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. నెల్లూరు సిటీ DKW కళాశాలలో ఇంటర్ పరీక్షలను కలెక్టర్ హిమాన్షు శుక్లా పరిశీలించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఇన్విజిలేటర్లకు సూచించారు.