News February 25, 2026

ప్రమాద బాధితులకు పీఎం రాహత్ పథకం: కలెక్టర్

image

రోడ్డు ప్రమాద బాధితుల కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం రాహత్ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం జిల్లా రవాణా శాఖ, మున్సిపల్, రోడ్డు భవనాలు, పోలీసు, పంచాయతీ శాఖ అధికారులతో పీఎం రాహత్ పథకంపై ఆమె సమీక్షించారు. ప్రమాదం జరిగిన 7 రోజుల్లోనే ఒక్కొక్కరికి గరిష్ఠంగా రూ.1.50 లక్షల నగదు రహిత వైద్య చికిత్స అందించనున్నారన్నారు. ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

Similar News

News April 20, 2026

CBN నిర్ణయం.. విశాలంగా తిరుమల మాడ వీధులు.!

image

2000–04 మధ్య చంద్రబాబు శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న ఇళ్లను తొలగించి ఇరుకైన మాడ వీధులను విశాలంగా నిర్మించారు. తిరుమలలో జనాభా తగ్గించి యాత్రికులకు ఎక్కువ స్థలం కేటాయించే ఉద్దేశంతో ఆ పని చేశారు. అక్కడ ఉన్నవారికి తిరుపతి పరిసరాల్లో పునరావాసం కల్పించారు. ప్రస్తుతం 1.15లక్షల మంది ఆలయ మాడవీధుల్లో స్వామిని వీక్షించే ఛాన్స్ ఉంది. దీనిపై మొదట వ్యతిరేకత వచ్చినా ప్రస్తుతం భక్తుల నుంచి CBNకు ప్రశంసలు అందాయి.

News April 20, 2026

ఇంద్రవెల్లి: నేలమట్టం చేసినా వెరవని ఆదివాసీలు

image

రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన ఆదివాసీ అమరవీరుల 80 అడుగుల స్థూపం చారిత్రక సాక్ష్యంగా నిలిచింది. 1986లో దుండగులు ఈ స్థూపాన్ని కూల్చివేయగా, ఆదివాసీల ఆందోళనల నేపథ్యంలో 1987లో ప్రభుత్వం పున:నిర్మించింది. దశాబ్దాల పాటు ఆంక్షల నీడలోనే నివాళులర్పించిన గిరిజనులు, రాష్ట్ర ఏర్పాటు తర్వాత స్వేచ్ఛగా వీరులను స్మరించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతం అమరవీరుల స్మృతి వనంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది.

News April 20, 2026

హ్యాపీ బర్త్‌డే మావయ్య: NTR

image

ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబుకు యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ హ్యాపీ బర్త్‌డే మావయ్యగారు అని SMలో శుభాకాంక్షలు తెలిపారు. ఇలాగే ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని.. ఇదే నిబద్ధత, విజన్‌తో ప్రజలకు సేవలు కొనసాగించాలని కోరుకున్నారు. మీ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి కొనసాగాలని ఆశిస్తున్నానని Xలో పోస్ట్ చేశారు. మరోవైపు వైసీపీ చీఫ్ జగన్ కూడా చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.