News February 9, 2025
ప్రయాగరాజ్కు మరో స్పెషల్ బస్ ఏర్పాటు

ఆర్టీసీ గుంటూరు-2 డిపో నుంచి మహాకుంభమేళా (ప్రయాగరాజ్)కు మరో స్పెషల్ బస్ ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ షేక్. అబ్దుల్ సలాం శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఈనెల 11న ఏర్పాటు చేసిన బస్సు నిండిపోవడంతో 15వ తేదీన మరో పుష్ బ్యాక్ సూపర్ లగ్జరీ బస్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ యాత్ర మొత్తం 8 రోజులు ఉంటుందని చెప్పారు. ఫిబ్రవరి 15న ఉదయం 10గంటలకు గుంటూరులో బస్సు బయలుదేరుతుందన్నారు.
Similar News
News April 11, 2026
GNT: ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు నందిగం సురేశ్

కాకినాడకు సంబంధించిన ఓ చర్చి ట్రస్ట్ రెన్యూవల్ కోసం మాజీ MP నందిగం సురేశ్ ఓ వ్యక్తి నుంచి రూ. 25 లక్షలు తీసుకొని మోసం చేశారంటూ విజయవాడకు చెందిన వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సురేశ్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి ఈ నెల 17వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారు.
News April 11, 2026
GNT: పెట్టుబడుల వెల్లువ.. క్యాబినెట్ నిర్ణయాలతో జిల్లాకు మహర్దశ!

రాష్ట్ర క్యాబినెట్ భేటీలో పారిశ్రామికాభివృద్ధి, సాంకేతిక రంగాలకు పెద్దపీట వేస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గుంటూరు జిల్లాలో 200 మెగావాట్ల బయోమాస్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు SAEL సంస్థకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్వాంటమ్ టెక్నాలజీ, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ వ్యాలిడేషన్ హబ్ కోసం భారీగా నిధులు కేటాయించడంతో పాటు, QAIG సంస్థకు 2.5 ఎకరాల భూమి, రూ.108 కోట్ల పెట్టుబడికి ఆమోదం తెలిపారు.
News April 11, 2026
హైదరాబాద్-మచిలీపట్నం ఎక్స్ప్రెస్వే కోసం కసరత్తు

హైదరాబాద్-అమరావతి-మచిలీపట్నం గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే కోసం మూడు మార్గాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అమరావతి ఓఆర్ఆర్ మీదుగా 303.7 కి.మీ, విజయవాడ బైపాస్, ఓఆర్ఆర్ మీదుగా 293.19 కి.మీ, రాజధాని గుండా వెళ్లే 288.33 కి.మీ మార్గాలను అధ్యయనం చేస్తున్నారు. ఈ మూడింటిలో అనువైన ఒక మార్గాన్ని త్వరలో అధికారికంగా ఖరారు చేయనున్నారు.


