News November 30, 2024
ప్రయాణాలు రద్దు చేసుకోండి: తిరుపతి కలెక్టర్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఫెంగల్ తుఫాన్గా మారిన నేపథ్యంలో తిరుపతి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరు ప్రయాణాలు చేయవద్దని సూచించారు. జిల్లాలో ఎటువంటి ఆస్తి, పశు, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమస్య ఉంటే కలెక్టరేట్ సైక్లోన్ కంట్రోల్ రూం(0877-2236007)ను సంప్రదించాలన్నారు.
Similar News
News February 8, 2026
చిత్తూరు: వృద్ధురాలి దారుణ హత్య

గుడిపల్లి (M) ON కొత్తూరు సమీపంలోని ఇటుకల బట్టీ వద్ద ఆదివారం చిన్నక్క (70) ఆనే వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె గొంతుతో పాటు చెవులను సైతం కోసి దారుణంగా హత్య చేశారు. ఇటుకల బట్టీలో వృద్ధురాలి మృతదేహం పడి ఉండడాన్ని ఇటుకల కోసం వచ్చిన వారు చూసి స్థానికులకు సమాచారం అందించారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 8, 2026
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రేపు PGRS కార్యక్రమం

చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజల ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ కార్యాలయం వెల్లడించింది. సోమవారం ఉ.10.30 గంటలకు పాత డీపీవో కార్యాలయంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను జిల్లాస్థాయి పోలీస్ అధికారులకు నేరుగా తెలియజేసి సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. ఫిర్యాదుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపింది.
News February 8, 2026
ఏవియన్ ఇన్ఫ్లూయెంజాపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

చిత్తూరు జిల్లాలోని ఏవియన్ ఇన్ఫ్లూయెంజాపై (బర్డ్ ఫ్లూ) పౌల్ట్రీ రైతులు అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. ఈ సందర్భంగా ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పౌల్ట్రీ పక్షుల్లో అధిక సంఖ్యలో మరణాలు సంభవించినట్లయితే వెంటనే పశుసంవర్ధక శాఖకు, జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఏవియన్ ఇన్ఫ్లూయెంజా పక్షి నుంచి పక్షికి మాత్రమే వ్యాపిస్తుందన్నారు.


