News April 11, 2025
ప్రయాణికుల రద్దీ మేరకు చర్లపల్లికి ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీ మేరకు శ్రీకాకుళం రోడ్(CHE), తెలంగాణలోని చర్లపల్లి(CHZ) మధ్య స్పెషల్ రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు ఏప్రిల్ 11 నుంచి జూన్ 27 వరకు ప్రతి శుక్రవారం CHZ- CHE(నెం.07025), ఏప్రిల్ 12 నుంచి జూన్ 28 వరకు ప్రతి శనివారం CHE- CHZ(నెం.07026) మధ్య ఈ ట్రైన్లు నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు విజయనగరం, కొత్తవలస, దువ్వాడ, అనకాపల్లితో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.
Similar News
News April 20, 2026
శ్రీకాకుళం జిల్లాలో రేపు పీజీఆర్ఎస్

ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి సమస్యలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్సైట్ను వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అర్జీలు సమర్పించిన అనంతరం 1100 నంబర్కు నేరుగా ఫోన్ చేసి వినతులకు సంబంధించిన స్థితి సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు.
News April 20, 2026
శ్రీకాకుళం జిల్లాలో రేపు పీజీఆర్ఎస్

ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి సమస్యలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్సైట్ను వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అర్జీలు సమర్పించిన అనంతరం 1100 నంబర్కు నేరుగా ఫోన్ చేసి వినతులకు సంబంధించిన స్థితి సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు.
News April 19, 2026
శ్రీకాకుళం: అసలు సూత్రధారులెవరో..?

ఈ ఏడాది రథసప్తమి వేడుకల్లో నకిలీ పాసుల వ్యవహారం వెలుగులోకొచ్చిన విషయం తెలిసిందే. వీటి ముద్రణలో అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి<<19679785>> ఆరుగురిపై<<>> కేసు నమోదు చేశారు. అసలు ఈ పాసులను ముద్రించమన్నదెవరూ? ఇవి బయటికెలా వచ్చాయనే విషయాలను వెల్లడించకపోవడంతో అసలు నిందితులను రాజకీయ ఒత్తిడితో దాచిపెట్టారనే ఆరోపణలోస్తున్నాయి. తెర వెనక పాత్రదారులను పట్టుకోవాలని భక్తుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది.


