News June 4, 2024

ప్రశాంతంగా ముగిసిన నిజామాబాద్ పార్లమెంట్ కౌంటింగ్

image

పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో ప్రశాంతంగా ముగిసిందని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. పార్లమెంటు నియోజకవర్గంలోని ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పోలైన ఓట్లను డిచ్పల్లి మండలం నడిపల్లిలోని సీఎంసీ కళాశాలలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ లెక్కించామన్నారు.

Similar News

News October 14, 2025

NZB: ఈనెల 21 నుంచి పోలీస్ అమరుల సంస్మరణ వారోత్సవాలు

image

విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ ఈ నెల 21 నుంచి 31 వరకు సంస్మరణ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు నిజామాబాద్ సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విధి నిర్వహణలో ప్రాణ త్యాగాలు చేసిన పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివని స్మరించుకున్నారు. వారోత్సవాల్లో భాగంగా వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు.

News October 14, 2025

నిజామాబాద్: సవాలుగా మారిన బంగారం చోరీ కేసు

image

ఇందల్వాయి మండలం లింగాపూర్‌లో దుర్గాదేవి నవరాత్రుల సమయంలో భారీ చోరీ జరిగింది. గ్రామానికి చెందిన అపర్ణ పూజా కార్యక్రమానికి వెళ్లిన సమయంలో ఇంట్లో చొరబడి 8 తులాల బంగారం, 25 తులాల వెండిని దొంగలు అపహరించారు. సోమవారం బాధితురాలు సీపీ సాయి చైతన్యకు ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయంపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై సందీప్ కేసు నమోదు చేశారు.

News October 14, 2025

నిజామాబాద్: బాలికలను ఆటపట్టించిన ఇద్దరి అరెస్టు

image

నిజామాబాద్‌లోని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కోటగల్లి వద్ద సోమవారం బాలికలను ఫాలో చేస్తూ అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు ఆకతాయిలను షీ టీం పట్టుకొని తదుపరి చర్యలకు టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. బాలికలను, మహిళలను ఎవరైనా వేధిస్తే షీ టీంకు తెలపాలన్నారు.