News April 2, 2025
ప్రశాంతంగా ముగిసిన పది పరీక్షలు

కొత్తగూడెం జిల్లాలో మార్చి 21 నుంచి ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు బుధవారంతో ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా విద్యాధికారి ఎం వెంకటేశ్వరాచారి, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ఎస్ మాధవరావు తెలిపారు. చివరగా సోషల్ స్టడీస్ పరీక్షకు 12273 మంది విద్యార్థులకు గాను 12240 విద్యార్థులు హాజరుకాగా 33 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. సప్లమెంటరీ విద్యార్థులు 26 మంది గాను 17 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు
Similar News
News December 5, 2025
1000 ఇండిగో సర్వీసులు రద్దు.. సారీ చెప్పిన CEO

విమానాలు ఆలస్యంగా నడవడం, పలు సర్వీసుల రద్దుతో ఇబ్బందిపడిన వారందరికీ ఇండిగో CEO పీటర్ ఎల్బర్స్ క్షమాపణలు చెప్పారు. విమాన సేవల్లో అంతరాయాన్ని అంగీకరిస్తున్నామని, 5 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఫ్లైట్ క్యాన్సిల్ సమాచారం అందుకున్న ప్రయాణికులు ఎయిర్పోర్ట్కు వచ్చి ఇబ్బంది పడొద్దని కోరారు. నేడు వెయ్యికిపైగా సర్వీసులు రద్దవగా, సంస్థ తీసుకుంటున్న చర్యలతో రేపు ఆ సంఖ్య తగ్గే ఛాన్స్ ఉంది.
News December 5, 2025
ప్రకాశం: నెలకు రూ.2 లక్షల శాలరీ.. డోంట్ మిస్.!

అబుదాబి, దుబాయ్ ప్రాంతాల్లో హోమ్ కేర్, నర్స్ ఉద్యోగావకాశాలు ఉన్నాయని, జిల్లాలోని అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్కిల్ డెవలప్మెంట్ జిల్లా అధికారి రవితేజ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. 21 నుంచి 40 సంవత్సరాలు గల మహిళలు అర్హులని, నెలకు రూ.2లక్షల వరకు వేతనం ఉంటుందన్నారు. ఈనెల 7వ తేదీలోగా ప్రకాశం జిల్లా నైపుణ్యం వెబ్సైట్లో పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.
News December 5, 2025
ఎన్నికల సిబ్బందికి రేపు శిక్షణ: కలెక్టర్

గ్రామ పంచాయతీల తొలి విడత ఎన్నికల నిర్వహణలో భాగంగా నియమించిన సిబ్బంది డిసెంబర్ 6న జరగనున్న శిక్షణా కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. హాజరు విషయంలో మినహాయింపు ఉండదని, గైర్హాజరైతే ఎన్నికల నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.


