News March 13, 2025
ప్రశాంతంగా హోలీ పండుగను జరుపుకోవాలి: ఎస్పీ

హోలీ పండుగను జరుపుకునే వారు జాగ్రత్తలు పాటిస్తూ ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ నరసింహ సూచించారు. యువత ప్రమాదాలకు దూరంగా ఉండాలని, ద్విచక్ర వాహనాలపై వేగంగా వెళ్లవద్దని, సాంప్రదాయ రంగులు ఉపయోగించడం ఆరోగ్యకరమని అన్నారు. ఇతరులకు ఇబ్బందులు కలిగించకుండా సాంప్రదాయక పండుగలు ఏమైనా ప్రజలు కలిసి మెలిసి ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలన్నారు.
Similar News
News December 1, 2025
అయిజ: “Way2News ఎఫెక్ట్” ఎట్టకేలకు నామినేషన్ దాఖలు

అయిజ మండలం ఉత్తనూర్ సర్పంచ్ స్థానానికి హాలియా దాసరి జయమ్మ నామినేషన్ వేసే ప్రయత్నం చేయగా అదే సామాజిక వర్గానికి చెందిన వారు బెదిరింపులకు గురి చేశారు. ఈ విషయమై Way2News లో సోమవారం ఉదయం “ఉత్తనూరులో హాలియా దాసర్లకు బెదిరింపులు” శీర్షికన కథనం ప్రచురితమైంది. కథనానికి మండల అధికారులు స్పందించి గ్రామానికి చేరుకున్నారు. వారిని కలిసి సాయంత్రం నామినేషన్ వేయించారు. వే2న్యూస్కు గ్రామస్థులు అభినందించారు.
News December 1, 2025
సంగారెడ్డి: నేషనల్ హైవే పురోగతిపై కలెక్టర్ సమీక్ష

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నేషనల్ హైవే 65 పనుల పురోగతిపై కలెక్టర్ ప్రావీణ్య సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జాతీయ రహదారి పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. హైవే పనుల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, అదనపు ఎస్పీ రఘునందన్ రావు పాల్గొన్నారు.
News December 1, 2025
కాంగ్రెస్కు శశిథరూర్ దూరం అవుతున్నారా?

కాంగ్రెస్కు ఆ పార్టీ MP శశిథరూర్కు మధ్య విభేదాలు ముదిరినట్లు తెలుస్తోంది. ఇటీవల SIRపై పార్టీ నిర్వహించిన భేటీకి ఆయన గైర్హాజరయ్యారు. అనారోగ్యం వల్లే వెళ్లలేదని చెప్పారు. కానీ తర్వాతి రోజే PM పాల్గొన్న ఓ ప్రోగ్రామ్కు వెళ్లారు. తాజాగా పార్లమెంట్ సెషన్స్ ముందు జరిగిన పార్టీ మీటింగ్కూ హాజరుకాలేదు. ట్రావెలింగ్లో ఉన్నందునే తాను రాలేదని ఆయన చెబుతున్నప్పటికీ INCకి దూరమవుతున్నారనే చర్చ జరుగుతోంది.


