News March 13, 2025

ప్రశాంతంగా హోలీ పండుగను జరుపుకోవాలి: ఎస్పీ

image

హోలీ పండుగను జరుపుకునే వారు జాగ్రత్తలు పాటిస్తూ ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ నరసింహ సూచించారు. యువత ప్రమాదాలకు దూరంగా ఉండాలని, ద్విచక్ర వాహనాలపై వేగంగా వెళ్లవద్దని, సాంప్రదాయ రంగులు ఉపయోగించడం ఆరోగ్యకరమని అన్నారు. ఇతరులకు ఇబ్బందులు కలిగించకుండా సాంప్రదాయక పండుగలు ఏమైనా ప్రజలు కలిసి మెలిసి ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలన్నారు.

Similar News

News February 8, 2026

వరంగల్: టైపు రైటింగ్ లోయర్ ఎగ్జామినేషన్ ఫలితాల వెల్లడిలో తప్పులు..!

image

తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ గత సంవత్సరం డిసెంబర్ 22న నిర్వహించిన టైపు రైటింగ్ లోయర్ ఎగ్జామినేషన్ ఫలితాల వెల్లడిలో దొర్లిన తప్పులు అభ్యర్థుల్లో ఆందోళన కలిగిస్తోంది. డిసెంబర్ 22న పరీక్షలు జరుగగా ఈనెల 7వ తేదీన విడుదల చేసిన రిజల్ట్స్‌లో మాత్రం డిసెంబర్ 23న పరీక్షలు జరిగినట్లు పేర్కొన్నారు. చాలామంది ఫెయిల్ అవ్వగా పరీక్షలపై వరంగల్లో అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేశారు.

News February 8, 2026

గోవా వెళ్తున్నారా? ఈ పని చేస్తే 24 గంటలు జైలులో ఉండాల్సిందే

image

గోవాలో ఇష్టానుసారం ఫొటోలు, వీడియోలు తీస్తే 24 గంటలు జైలులో గడపాల్సిందే. పర్మిషన్ లేకుండా విదేశీయులు/ఇండియన్స్ ఫొటోలు తీసినా, సెల్ఫీలకు వేధించినా జైలుకు పంపిస్తామని పోలీసులు హెచ్చరించారు. టూరిస్టుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదన్నారు. పోలీసుల నిర్ణయంపై SMలో పాజిటివ్ కామెంట్లు వస్తున్నాయి. నార్త్ గోవా బాగా బీచ్‌లో టూరిస్టులను వేధించిన తమిళనాడుకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు.

News February 8, 2026

మరణించినవారి ఫొటోలు ఎక్కడ ఉంచాలంటే?

image

చనిపోయిన వారి ఫొటోలను పూజా మందిరంలో దేవుడి పటాలతో కలిపి పెట్టకూడదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఇది వాస్తురీత్యా తప్పని వివరిస్తున్నారు. ‘మరణించిన వారు ఎంతటి వారైనా దేవుళ్లతో సమానం కాదు. వారి ఫొటోలను యమస్థానమైన దక్షిణ వైపు గోడలకు తగిలించడం మంచిది. వారి ఫొటోలు హాలులో కూడా ఉంచకూడదు. లేకపోతే ఇంట్లో ఇబ్బందులు తలెత్తవచ్చు. శాస్త్రనియమాలను అనుసరించి సరైన దిశలో ఉంచాలి’ అన్నారు. <<-se>>#Vasthu<<>>