News April 24, 2024
ప్రశాంత ఎన్నికలే లక్ష్యం – జిల్లా ఎస్పీ ఆరిఫ్

నెల్లూరు జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలను నిర్వహించడమే లక్ష్యంగా సాయుధ బలగాలతో కవాతు నిర్వహిస్తున్నామని ఎస్పీ కె.ఆరీఫ్ హఫీజ్ తెలిపారు. జిల్లాలోని అనంతసాగరం, మనుబోలు, కావలి రూరల్, కందుకూరు రూరల్, సంతపేట తదితర ప్రాంతాల్లో సాయుధ బలగాలతో కవాతు నిర్వహించారు. ప్రజలు భయాన్ని వీడి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవాలన్నారు.
Similar News
News March 9, 2026
కావలి: చదివింది 5th.. రూ.150 కోట్లకు కుచ్చుటోపి.!

చదివింది 5th. రియల్ ఎస్టేట్లో అంచెలంచెలుగా ఎదిగి HYDలో త్రిపుర కన్స్ట్రక్షన్ ప్రారంభించాడు. ప్రజల నుంచి ప్లాట్ల పేరుతో భారీగా వసూలు చేశాడు. ఎన్నికల్లో జనసేన నుంచి పోటీచేసి దాదాపు రూ.150 కోట్లు ఖర్చు చేసినా డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయాడు కావలికి చెందిన పసుపులేటి సుధాకర్. ప్రజలు నిలదీయడంతో ఆయన బండారం బయటపడింది. అపార్ట్మెంట్స్ పేరుతో ప్రజలను మోసం చేసిన కేసులో పోలీసులు దంపతులను అరెస్ట్ చేశారు.
News March 9, 2026
దుత్తలూరులో రక్షణ రంగ పరిశ్రమ

దుత్తలూరు పరిసర ప్రాంతంలో ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ సంస్థ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే దేశానికి కీలక వ్యవస్థగా ఉన్న రక్షణ రంగం ముడి సరుకు తయారీ ప్రాంతంగా దుత్తలూరు కేంద్రం కానున్నడంతో ఈ ప్రాంత నిరుద్యోగులకు మరింత ఆశలు చిగురించాయి. ప్రభుత్వం జీవో నెం.41ను సైతం విడుదల చేసింది. ఈ పరిశ్రమ ఏర్పాటుతో 250 మందికి ప్రత్యక్షంగా, మరో 250 మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది.
News March 9, 2026
CI రవి నాయక్, SI ప్రసాద్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

కృష్ణపట్నం సర్కిల్ సీఐ రవి నాయక్, ముత్తుకూరు ఎస్ఐ ప్రసాద్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. పొక్సో కేసు ముద్దాయి విషయంలో అలసత్వం వహించారనే ఆరోపణలతో వీరిని సస్పెండ్ చేస్తూ గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. ఓకే సర్కిల్ పరిధిలోని ఎస్ఐ, సీఐ సస్పెండ్తో కలకలం రేగింది.


